IPL 2025: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. | Jasprit Bumrah likely to miss first two weeks of IPL 2025: Report | Sakshi
Sakshi News home page

IPL 2025: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌..

Mar 8 2025 10:41 AM | Updated on Mar 8 2025 11:07 AM

Jasprit Bumrah likely to miss first two weeks of IPL 2025: Report

ఐపీఎల్‌-2025(IPL-2025) ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు భారీ షాక్ తగలింది. ఆ జట్టు స్టార్ పేసర్‌, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్‌​ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలోనే కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. అతడు తన పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ భారత స్పీడ్ స్టార్ ఏప్రిల్‌లో ముంబై ఇండియన్స్‌ శిబిరంలో చేరే అవకాశం ఉంది.

"బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు. అతడి మెడికల్‌​ రిపోర్ట్స్‌​ బాగానే ఉన్నాయి. అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తిరిగి తన బౌలింగ్ ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. అయితే ఐపీఎల్‌లో బౌలింగ్ చేసే ఫిట్‌నెస్ మాత్రం ఇంకా సాధించలేదు. ఏప్రిల్ మొదటి వారంలో బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశముంది. అది కూడా మేము కచ్చితంగా చెప్పలేము. మా వైద్య బృందం అతడిపై క్రమంగా వర్క్‌లోడ్ పెంచుతుంది.

అతడు ఎటువంటి అసౌకర్యం లేకుండా బౌలింగ్ చేయగలిగితేనే వైద్య బృందం క్లియరన్స్ ఇస్తోంది. అప్పటివరకు అతడు సీఓఈలోనే ఉండనున్నాడని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నైసూపర్ కింగ్స్‌తో తలపడనుంది. 

హార్దిక్‌ కూడా..
ఈ మ్యాచ్‌కు ముంబై రెగ్యూలర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం దూరం కానున్నాడు. గతేడాది సీజన్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా పాండ్యాపై ఒక్క మ్యాచ్ నిషేధం పడింది.​  హార్దిక్  గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మూడోసారి స్లో ఓవర్‌ రేట్‌కు కారణమయ్యాడు.

దీంతో వరుసగా మూడు సార్లు స్లో ఓవరేట్‌ను మెయింటేన్ చేయడంతో ఐపీఎల్ నిర్వహకులు అతడిపై ఆడకుండా ఒక్క మ్యాచ్ నిషేదం విధించారు. ఆ బ్యాన్‌ను పాండ్యా ఈ ఏడాది సీజన్‌లో ఎదుర్కొన్నాడు. తొలి మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. కాగా గతేడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో లీగ్‌​ స్టేజికే పరిమితమైన సంగతి తెలిసిందే.
చదవండి: BCCI: శుబ్‌మన్‌ గిల్‌కు ప్రమోషన్‌.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement