వెంకటేష్ అయ్యర్‌కు జాక్ పాట్‌.. ఏకంగా రూ. 23.75 కోట్లు | IPL 2025 Mega Auction: Venkatesh Iyer Sold To KKR For Rs 23.75 Crores, Check Out More Insights | Sakshi
Sakshi News home page

IPL 2025 Mega Auction: వెంకటేష్ అయ్యర్‌కు జాక్ పాట్‌.. ఏకంగా రూ. 23.75 కోట్లు

Nov 24 2024 7:21 PM | Updated on Nov 25 2024 3:29 PM

IPL 2025: Venkatesh Iyer sold to KKR for Rs. 23.75 crore

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేష్‌ అయ్యర్‌ ఊహించని ధర పలికాడు. అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన  అయ్యర్ కోసం కేకేఆర్‌, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. 

ఆఖరికి ఆ‍ర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్‌ను కోల్‌కతా సొంతం చేసుకుంది. గత సీజన్‌లో కూడా వెంకటేష్ అయ్యర్ కేకేఆర్‌కే ప్రాతినిథ్యం వహించాడు. అయితే వేలానికి ముందు అతడిని కేకేఆర్‌ రిటైన్ చేసుకోలేదు.

కాగా వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్‌-2021 సీజన్‌లో కేకేఆర్ తరపునే అరంగేట్రం చేశాడు. తొలుత అతడిని రూ.20లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అద్బుతంగా రాణించడంతో 2022 వేలానికి ముందు రూ. 8 కోట్లకు అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది.

ఆ తర్వాత రెండు సీజన్ల పాటు తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వెంకటేష్‌ను ఐపీఎల్‌-2025 వేలంలోకి కేకేఆర్‌ విడిచిపెట్టింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా 23.75 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో వెంకటేష్ ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడి 1326 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఓసెంచరీ, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి,

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement