ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్‌! | Indias-tour of New Zealand: 50000 tickets sold in Two Weeks | Sakshi
Sakshi News home page

IND Vs NZ: వాళ్లిద్ద‌రి కోసం ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్‌!

Sep 9 2026 3:51 PM | Updated on Sep 9 2026 4:13 PM

Indias-tour of New Zealand: 50000 tickets sold in Two Weeks

Photo Credit: Twitter

టీమిండియా జ‌ట్టు అక్టోబ‌ర్ చివ‌ర్లో న్యూజిలాండ్‌లో ప‌ర్య‌టించ‌నుంది. అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ మ‌ధ్య రెండు నెల‌ల పాటు టీమిండియా ఐదు టీ20లు, ఐదు వ‌న్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఆరేళ్ల త‌ర్వాత భార‌త్ న్యూజిలాండ్‌లో పర్య‌టించనుండ‌డంతో ఇప్ప‌టినుంచే టికెట్ల హ‌డావిడి మొద‌లైంది. గత రెండు వారాల్లోనే 50వేల టికెట్లు అమ్ముడైన‌ట్లు న్యూజిలాండ్ క్రికెట్ పేరేంటింగ్ బాడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

మొదట క్రికెట్ నేషన్ సభ్యులు, స్కై కస్టమర్లు, ఏఎన్‌జెడ్ కస్టమర్ల కోసం రెండు వారాల ప్రీ సేల్ విండో ఇచ్చారు. ఆగస్టు 24న క్రికెట్ నేషన్ ప్రీ సేల్ మొదలైన 48 గంటల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయని న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. తర్వాత అభిమానుల కోసం కూడా టికెట్లను ఓపెన్ చేశారు. 

ముందుగానే సభ్యత్వం తీసుకున్న వారికి 15 శాతం డిస్కౌంట్ కూడా ఇచ్చారు. భారత్ సిరీస్ కోసం టికెట్లపై డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన బోర్డు, ఆగస్టులోనే అభిమానులను ప్రీ రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. పబ్లిక్ టికెట్ సేల్స్ మొదలైన తర్వాత కూడా బుకింగ్స్ వేగంగా సాగుతున్నాయి.

క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో అక్టోబర్ 24న జరిగే రెండో టీ20కు ఇప్పటికే 75 శాతం టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ మైదానంలో భారత్ రెండు టీ20లు ఆడనుంది. అక్టోబర్ 22, 24 తేదీల్లో ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి. హాగ్లీ ఓవల్‌లో మ్యాచ్‌లకు ఎప్పుడూ కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులు వస్తారని న్యూజిలాండ్ క్రికెట్ మార్కెటింగ్ హెడ్ టిమ్ ఎల్లిస్ చెప్పారు. 

కానీ ఒక మ్యాచ్‌కు ఇంత ముందుగానే మూడు వంతులకుపైగా టికెట్లు అమ్ముడవడం చాలా స్పెషల్ అని అన్నారు. సుమారు 9 వేల మంది సామర్థ్యం ఉన్న ఈ మైదానంలో నవంబర్ చివర్లో రెండో టెస్ట్ కూడా జరగనుంది.

Image
Photo Credit: Twitter

రోహిత్‌, కోహ్లి క్రేజ్‌..
కివీస్ గ‌డ్డ‌పై టీమిండియాకు ఇంత క్రేజ్ రావ‌డానికి కార‌ణం మాత్రం విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత ఈ ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్లు అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికే అవ‌కాశమున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సౌతాఫ్రికాలో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో, త‌మ అభిమాన క్రికెట‌ర్ల‌ను చివ‌రిసారి చూసుకోవాల‌ని అభిమానులు టికెట్ల కోసం ఎగ‌బ‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

 

 

Read: ఈస్ట్‌జోన్‌దే టైటిల్‌!.. చ‌రిత్ర సృష్టించ‌నున్న వైభ‌వ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement