భారత్‌ ఖాతాలో స్వర్ణం.. కీలకపాత్ర పోషించిన తెలుగు అమ్మాయి | India Beats Korea To Win U21 Recurve Women's Gold At World Archery KAA Youth Invitational 2026 | Sakshi
Sakshi News home page

భారత్‌ ఖాతాలో స్వర్ణం.. కీలకపాత్ర పోషించిన తెలుగు అమ్మాయి

Aug 15 2026 12:03 PM | Updated on Aug 15 2026 12:10 PM

India Beats Korea To Win U21 Recurve Women's Gold At World Archery KAA Youth Invitational 2026

భారత యువ ఆర్చర్లు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న World Archery KAA Youth Invitational 2026 U21 రికర్వ్ మహిళల టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించారు.

ప్రాంజల్ థోలియా, ఖుషి కుమావత్, యుక్త శ్రీ కొండపావులూరి (ఆంధ్రప్రదేశ్‌)తో కూడిన భారత జట్టు ఫైనల్లో ఆతిథ్య దక్షిణ కొరియాను 5-3తో ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. కొరియా గడ్డపైనే ఆ దేశ జట్టును ఓడించడం భారత యువ ఆర్చర్ల విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది.

క్వాలిఫికేషన్ దశ నుంచి నిలకడగా రాణించిన భారత త్రయం ఫైనల్లోనూ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంది. కొరియా నుంచి వచ్చిన సవాలును తిప్పికొట్టి 5-3తో మ్యాచ్‌ను ముగించి స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది.

కాంపౌండ్ విభాగంలో రజతం
మరోవైపు, భారత U21 కాంపౌండ్ మహిళల జట్టు కూడా టైటిల్ పోరులోకి దూసుకెళ్లింది. అదితి గోపిచంద్ స్వామి, తేజల్ రాజేంద్ర సాల్వే, వైష్ణవి కుమార్ పాటిల్‌తో కూడిన జట్టు చైనీస్ తైపీ చేతిలో అత్యంత ఉత్కంఠభరితమైన పోరులో 228-229తో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది.

అయితే కొరియాతో జరిగిన ప్రత్యేక ఎగ్జిబిషన్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించి స్వర్ణం అందుకుంది.

వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్‌లో అదితి స్వామి రజత పతకం కూడా సాధించింది. దీంతో ఈ టోర్నీలో భారత యువ ఆర్చర్ల పతకాల ఖాతా మరింత బలపడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement