మీరే తెలంగాణ ద్రోహులు | YS Sharmila Sensational Comments on CM KCR | Sakshi
Sakshi News home page

మీరే తెలంగాణ ద్రోహులు

Nov 6 2023 6:24 AM | Updated on Nov 6 2023 7:40 AM

YS Sharmila Sensational Comments on CM KCR - Sakshi

లక్డీకాపూల్‌(హైదరాబాద్‌):‘అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారు. మీ తండ్రీకొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరు’’అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణ ద్రో హులంటూ తననుద్దేశించి బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందిస్తూ నమ్మి రెండు దఫాలు అధికారమిస్తే రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన వెన్నుపోటుదారులనీ, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి తమ కుటుంబాన్నే అభివృద్ధి చేసుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

‘రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి దివాలా తీయించి, కోటి ఎకరాల మాగాణికి సాగునీరందిస్తామని చెప్పి పనికి రాని ప్రాజెక్ట్‌ కట్టి రూ.లక్ష కోట్లు కాజేశారు’అని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా మని హామీనిచ్చి 10 ఏళ్లలో రాష్ట్రంలో లక్ష ఉ ద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలంతా ఏకమై సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో నిధులు మీ ఖజానాకే.. నీళ్లు మీ ఫాంహౌస్‌కే.. నియామకాలు మీ ఇంట్లోకే పరిమితం చేశారు’అని షర్మిల ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement