‘ఆస్తులు పోగొట్టుకున్నా.. లోకేష్‌ నుంచి ప్రాణహాని ఉంది’ | TDP Leader Akula Venkateswara Rao Slams Nara Lokesh, Alleges Threat To Life From Him - Sakshi
Sakshi News home page

నాకు లోకేష్ నుంచి ప్రాణహాని ఉంది: టీడీపీ నేత

Aug 28 2023 4:22 PM | Updated on Aug 28 2023 6:45 PM

TDP Leader Akula Venkateswara Rao Slams Nara Lokesh - Sakshi

ఢిల్లీ: తనను చంపేందుకు నారా లోకేష్‌ కుట్ర చేస్తున్నారని టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు.  లోకేష్‌ తనను రెడ్‌ బుక్‌లో ఎక్కించారని, తనకు లోకేష్‌ నుంచి ప్రాణ హాని ఉందన్నారు ఆకుల వెంకటేశ్వరరావు.  కేంద్రఎన్నికల సంఘం  వద్ద చంద్రబాబును ఆకుల వెంకటేశ్వరరావు అడ్డుకున్నారు. ఆకుల వెంకటేశ్వరరావును టీడీపీ ఆఫీస్‌ సిబ్బంది పక్కకు నెట్టేశారు. 

ఈ క్రమంలోనే మీడియా వద్ద గోడు వెళ్లబోసుకున్నారు ఆకుల వెంకటేశ్వరరావు. ‘పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న. జూబ్లీ హిల్స్ లో 400 గజాల భూమిని చంద్రబాబు మనిషి కే ఎల్. నారాయణ లాకున్నారు. న్యాయం చేయాలని అడిగితే పట్టించుకోవడంలేదు. నన్ను వాడుకొని వదిలేశాడు.నాకు చంద్రబాబు అన్యాయం చేశారు. పార్టీ లేదు,  ఏమీ లేదు అన్న అచ్చెనాయుడిని టీడీపీ అధ్యక్షుడిని చేశారు’ అని విమర్శించారు ఆకుల వెంకటేశ్వరరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement