నేడు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ | RS Praveen Kumar Will Join In BRS Party | Sakshi
Sakshi News home page

నేడు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

Mar 18 2024 7:43 AM | Updated on Mar 18 2024 9:00 AM

RS Praveen Kumar Will Join In BRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్‌ అవుతున్నారు. తాజాగా బీఎస్పీకి రాజీనామా చేసిన ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ గులాబీ గూటికి చేరనున్నారు. సోమవారం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. 

ఈ మేరకు ప్రవీణ్‌ కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా..‘నా రాజకీయ భవితవ్యంపై హైదరాబాద్‌లో ఆదివారం వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులతో మేధోమధనం జరిపాను. ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే నడుస్తానని మాట ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం సోమవారం కేసీఆర్‌ సమక్షంలో ఆపార్టీలో చేరబోతున్నా. ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా’ అంటూ పోస్టు పెట్టారు. 

ఇదిలా ఉండగా.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రవీణ్‌ కుమార్‌ బీఎస్పీ తరఫున సిర్పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement