
ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేక జనసేన వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి
సాక్షి, కాకినాడ: ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేక జనసేన వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్ కల్యాణ్ తర్జనభర్జన పడుతున్నారు. బీజేపీ నాయకత్వం తనను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పిందన్న పవన్.. మరోవైపు, కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు.
ఒక వేళ అమిత్షా చెప్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేస్తే.. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారని పవన్ చెప్పారు. ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించుకున్న పవన్.. ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళ్తానంటున్నారు. ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీపై స్పష్టత లేకపోవడంతో జనసేన వర్గాలు టెన్షన్ పడుతున్నారు.
ఇదీ చదవండి: నారా లోకేష్పై టీడీపీలో కొత్త చర్చ.. అసలేం జరుగుతోంది?