BJP MP Dharmapuri Arvind Sensational Allegations Against MLC Kavitha, Details Inside - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్‌ సంచలన ఆరోపణలు

Jul 16 2023 6:28 PM | Updated on Jul 16 2023 7:00 PM

MP Arvind Sensational Allegations Against MLC Kavitha - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళ్ల దగ్గర మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దారబోస్తున్నారని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

కాగా, ఎంపీ అరవింద్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన ప్రతీ బిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమీషన్‌ వెళ్తోంది. ఒకే పనికి డబుల్‌ బిల్లింగ్‌ చేస్తున్నారు. రోడ్ కార్పోరేషన్‌ డెవలప్‌మెంట్‌ నుంచి కట్టినట్టు శిలాఫలకం వేశారు. కేంద్రం ద్వారా నిధులు పొందినట్టు కేంద్రానికి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. 50 ఏళ్లు వడ్డీలేని రుణం ద్వారా నిర్మించినట్టు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా స్కామ్‌ జరిగింది అని ఆరోపణలు చేశారు. 

ఇది కూడా చదవండి: వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో నాలుగు రోజులు గట్టి వానలే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement