విశాఖపట్నం: ఓటు వేయని వాడికి సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి? అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విశాఖ రుషికొండలో ఆదివారం ఒక పుస్తకావిష్కరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటరు లిస్టులో పేరు లేకుంటే.. ఆ ఓటరు చచ్చిపోయినట్లేనని, పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటు వేయనివాడికి పథకాలు ఎందుకివ్వాలని ప్రశ్నించారు.
ఓటరు లిస్టులో పేరు ఉందో.. లేదో.. తెలియని వాడికి కూడా పథకాలివ్వాలా అంటూ.. ఆవేశంతో ఊగిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇంటింటికీ అధికారులను పంపించి ఓటు నమోదు చేసుకోవడమేంటి.. మీరు ఓటు నమోదు చేసుకోలేరా? ఆ బాధ్యత మీకు లేదా.. అంటూ అయ్యన్నపాత్రుడు నిలదీశారు.


