అధికారం కోసం కాంగ్రెస్‌ వంద అబద్ధాలు

Minister Harish rao Sensational Comments on Congress Party - Sakshi

హాస్యాస్పదంగా హస్తం మేనిఫెస్టో: మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేటజోన్‌: పక్కనున్న కర్ణాటకలో ఐదు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్, ప్రియాంకాగాంధీ పత్తా లేకుండాపోయారని, అక్కడ పరిస్థితి గందరగోళంగా మారిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో జరిగిన పలు సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పలు పార్టీల ప్రతినిధులు, నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. హరీశ్‌రావు మాట్లాడుతూ వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావా లని కాంగ్రెస్‌ తాపత్రయపడుతోందని అన్నారు.

మనకు బూతు మాటలు మాట్లాడే నేతలు కాదని, భవిష్యత్తు అందించే నాయకులు కావాలన్నారు. బట్టేబాజ్‌ మాటలు చెప్పే కాంగ్రెస్‌ పార్టీ నిజస్వరూ పాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో మోకాలిచిప్పకు ఉచితంగా ఆపరేషన్లు అని పెట్టారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే ఉచితంగా మోకాలి చిప్ప ఆపరేషన్లు చేస్తోందని, కాంగ్రెస్‌ వాళ్లకు అది కూడా తెలవదని ఎద్దేవా చేశారు.

భవిష్యత్తులో 112 నియోజక వర్గాల్లో అగ్రవర్ణ కులాల పిల్లలకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. తొమ్మిదేళ్లు వర్గీకరణ అంశంపై జాప్యం చేసి ఇప్పుడు ఎన్నికల ముందు కేంద్రం కమిటీ అని కొత్త నాటకానికి తెర తీసిందని హరీశ్‌ విమర్శించారు. టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కమిటీ నాయ కులు మంత్రి హరీశ్‌ను కలిసి బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు.

వర్గీకరణకు బీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉందని, తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. మనకు కావాల్సింది కమిటీ కాదనీ, బిల్లు రావాలని, వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని స్పష్టం చేశారు.బీఆర్‌ఎస్‌లో చేరిన బాబుమోహన్‌ తనయుడు సంగారెడ్డి జిల్లా బీజేపీ అందోల్‌ నియోజకవర్గ అభ్యర్థి బాబుమోహన్‌ కుమారుడు ఉదయ్‌భాస్కర్‌ ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-11-2023
Nov 20, 2023, 04:51 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/సాక్షి, నాగర్‌ కర్నూల్‌: కాంగ్రెస్‌ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని.. ఇందిరమ్మ పాలన అంటే ఆకలి చావులు, ప్రజలను...
20-11-2023
Nov 20, 2023, 04:23 IST
నిర్మల్‌/సాక్షి, ఆసిఫాబాద్‌: ‘‘రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అదే కేసీఆర్‌ కుటుంబంలో మాత్రం అందరికీ...
19-11-2023
Nov 19, 2023, 17:57 IST
తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తులంతా దారికి వచ్చారా? రెబల్స్‌గా బరిలో దిగినవారంతా ఉపసంహరించుకున్నారా? తిరుగుబాటు దారుల్లో ఇంకా ఎందరు పోటీలో ఉన్నారు?...
19-11-2023
Nov 19, 2023, 16:01 IST
ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 2009 వరకు జిల్లాలో ఎర్ర పార్టీలకు ఏదో ఒకచోట ఎమ్మెల్యే ఉండేవారు....
19-11-2023
Nov 19, 2023, 15:06 IST
ఎన్నికలు ఏవైనా ఒకరు ఓడితేనే మరొకరు గెలుస్తారు. రాష్ట్రం అంతటా ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరా హోరీ పోరాడుతున్నారు. ఆ...
19-11-2023
Nov 19, 2023, 14:14 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
19-11-2023
Nov 19, 2023, 13:20 IST
సాక్షి,పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు మరోవారం రోజుల్లో ముగియనుంది. అయినా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన...
19-11-2023
Nov 19, 2023, 12:55 IST
సాక్షి, కరీంనగర్‌/పెద్దపల్లి: శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాటు చేసే ఎన్నికల ప్రచారసభ, ఇంటింటిప్రచారం.. ఏదైనా కార్యకర్తలు మాత్రం...
19-11-2023
Nov 19, 2023, 12:34 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పాలమూరు వ్యాప్తంగా ‘హస్తంశ్రీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. తారుమారు రాజకీయాల పరంపర ప్రధాన పార్టీలన్నింటిలోనూ కొనసాగుతున్నప్పటికీ.....
19-11-2023
Nov 19, 2023, 12:10 IST
సాక్షి, కామారెడ్డి: దొంగ ఓట్లను నియంత్రించడానికి నాటి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ టీఎన్‌ శేషణ్‌ విశేషంగా కృషి చేశారు. ఆయన...
19-11-2023
Nov 19, 2023, 11:18 IST
సాక్షి, నిజామాబాద్‌: ఆరు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ కుయుక్తులు పన్నుతోందని, ఏరు దాటాక తెప్ప తగలేస్తుందని మంత్రి...
19-11-2023
Nov 19, 2023, 11:15 IST
సాక్షి, ఆదిలాబాద్‌: సమర్థవంత ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాలెట్‌ బాక్స్‌ మొదలు...
19-11-2023
Nov 19, 2023, 09:54 IST
సాక్షి, రంగారెడ్డి/వికారాబాద్‌: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కలి్పస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌...
19-11-2023
Nov 19, 2023, 09:50 IST
సాక్షి, రంగారెడ్డి/వికారాబాద్: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏది చెప్పిందో అది కచ్చితంగా చేసి తీరుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌...
19-11-2023
Nov 19, 2023, 09:01 IST
సాక్షి, ఆదిలాబాద్‌: మూడు ప్రధాన పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు ప్రజల ముందుకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఆ హామీలను...
19-11-2023
Nov 19, 2023, 05:30 IST
నిర్మల్‌: రాష్ట్రంలో 12 శాతం మంది ఓట్లను బీఆర్‌ఎస్, ఎంఐఎం నమ్ముకున్నాయని, కాంగ్రెస్‌ మతపెద్దలను నమ్ముకుందని, ఇక హిందువులు ఓటు...
19-11-2023
Nov 19, 2023, 04:45 IST
సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా నేడు(ఆదివారం) రాష్ట్రానికి రానున్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో సకలజనుల...
19-11-2023
Nov 19, 2023, 04:38 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తామని, సమర్థవంతమైన పాలనపై దృష్టిపెడతామని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల...
19-11-2023
Nov 19, 2023, 04:35 IST
సాక్షి, సిద్దిపేట:  కాంగ్రెస్‌ నేతలు తెలంగాణకు వచ్చి రూ.4 వేలు పింఛన్‌ ఇస్తామని చెబుతున్నారని, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా...
19-11-2023
Nov 19, 2023, 04:22 IST
2జీ, 3జీ, 4జీ పార్టీల నుంచి విముక్తి కల్పించాలి  బీఆర్‌ఎస్, మజ్లిస్, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటే. అవి 2జీ, 3జీ, 4జీగా...



 

Read also in:
Back to Top