చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ ఎన్నికలలో చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి, దాన్ని వదిలేసి, అనవసరంగా పంచి డైలాగ్ల గురించి మాట్లాడటంలో అర్థం లేదని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, ప్రచార డిప్యూటీ సెక్రటరీ అప్సరా రెడ్డి విమర్శించారు. చెన్నై విమానాశ్రయం జరిగిన విలేకర్ల సమావేశంలో అన్నాడీఎంకే లో ప్రచార శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళణి స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.
ఏఐఏడీఎంకే పాలనలో ప్రజలకు ఇచ్చిన, చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేర్చిందన్నారు. ఏఐఏడీఎంకే ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చిన ఏకైక ప్రభుత్వం అని అన్నారు. విజయ్ ప్రభుత్వం రీల్స్ వ్యామోహాన్ని విడిచిపెట్టాలన్నారు. ఎప్పటికైనా, ఏఐఏడీఎంకే ప్రభుత్వం చేసిన మంచి ప్రణాళికలను, ప్రస్తుత ప్రభుత్వ అవకతవకలను ప్రజలు గ్రహిస్తారని అభిప్రాయపడ్డారు.


