Telangana News: ఆరెంజ్‌ ట్రావెల్స్‌ .. సునీల్‌రెడ్డి ఇంట్లో విషాదం..!
Sakshi News home page

ఆరెంజ్‌ ట్రావెల్స్‌.. సునీల్‌రెడ్డి ఇంట్లో విషాదం..!

Oct 14 2023 1:30 AM | Updated on Oct 14 2023 12:25 PM

- - Sakshi

నిజామాబాద్‌: కాంగ్రెస్‌ నాయకుడు, ఆరెంజ్‌ ట్రావె ల్స్‌ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. గురువారం రాత్రి ఆయన కుమార్తె సమన్వి (16) అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందింది. అదే రోజు రాత్రి మృతదేహన్ని మెండోరా మండలం సావెల్‌ గ్రామంలో ఆయన స్వగృహానికి తరలించారు. శుక్రవారం ఉదయం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. సునీల్‌రెడ్డిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ అర్వింద్‌, మాజీ ప్ర భుత్వ విప్‌ ఈరవత్రి అనిల్‌, డీసీసీ అధ్యక్షు డు మానాల మోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నా యకుడు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డిలు శుక్రవారం ఆయన నివాసంలో పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement