హిమాచల్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా దివ్యాంగ మహిళలు | Two Visually-Impaired Women Appointed Faculty in Shimla Varsities | Sakshi
Sakshi News home page

హిమాచల్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా దివ్యాంగ మహిళలు

Jul 17 2023 5:26 AM | Updated on Jul 17 2023 5:26 AM

Two Visually-Impaired Women Appointed Faculty in Shimla Varsities - Sakshi

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇద్దరు దివ్యాంగ మహిళలు అరుదైన ఘనత సాధించారు. అంధులైన వీరిద్దరూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా నియమితులయ్యారు. పట్టుదల, అంకితభావంతో తమ కలలను నిజం చేసుకున్నారు. రైతు కుటుంబంలో జని్మంచిన ముస్కాన్‌ ప్రముఖ గాయకురాలు. హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి ఎన్నికల సంఘం యూత్‌ ఐకాన్‌గా ఇప్పటికే గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.

2013లో రాజ్‌కియా కన్య మహావిద్యాలయలో సంగీతంలో ప్రవేశం పొందారు. ఇప్పుడు అదే విద్యాసంస్థలో సంగీతంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ముస్కాన్‌ చురుగ్గా ఉంటున్నారు. సాధారణమధ్య తరగతి కుటుంబంలో జని్మంచిన ప్రతిభా ఠాకూర్‌ సైతం అంధురాలు. పీహెచ్‌డీ పూర్తిచేశారు. విద్యా రంగంలో సేవలు అందించాలన్నది ఆమె చిన్నప్పటి కల. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితురాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement