-
హిమాచల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా దివ్యాంగ మహిళలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ఇద్దరు దివ్యాంగ మహిళలు అరుదైన ఘనత సాధించారు. అంధులైన వీరిద్దరూ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులయ్యారు. పట్టుదల, అంకితభావంతో తమ కలలను నిజం చేసుకున్నారు. రైతు కుటుంబంలో జని్మంచిన ముస్కాన్ ప్రముఖ గాయకురాలు. హిమాచల్ప్రదేశ్ నుంచి ఎన్నికల సంఘం యూత్ ఐకాన్గా ఇప్పటికే గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో రాజ్కియా కన్య మహావిద్యాలయలో సంగీతంలో ప్రవేశం పొందారు. ఇప్పుడు అదే విద్యాసంస్థలో సంగీతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ముస్కాన్ చురుగ్గా ఉంటున్నారు. సాధారణమధ్య తరగతి కుటుంబంలో జని్మంచిన ప్రతిభా ఠాకూర్ సైతం అంధురాలు. పీహెచ్డీ పూర్తిచేశారు. విద్యా రంగంలో సేవలు అందించాలన్నది ఆమె చిన్నప్పటి కల. రాజీవ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితురాలైంది. -
వెబ్సైట్లో అభ్యర్థుల జాబితా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రూప్–2 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల జాబితాను సోమ వారం కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు www.tspsc. gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పోస్టింగ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన 72 మంది డాక్టర్లకు వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్రెడ్డి సోమవారం పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు -
74 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య డైరెక్టరేట్ పరిధి లోని బోధనాసుపత్రుల్లో 74 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిగింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఖాళీగా ఉన్న 225 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకోసం శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఇప్పటికే సివిల్ సర్జన్లుగా పనిచేస్తున్న డాక్టర్లను సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్కు ఆహ్వానించారు. 25 స్పెషాలిటీలకు 350 మందిని కౌన్సెలింగ్కి పిలిచారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో 45, గాంధీలో 9, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో 28, నిజామాబాద్ జీఎంసీలో 18, సిద్దిపేట జీఎంసీలో 10, ఆదిలాబాద్ రిమ్స్లో ఏడు పోస్టులతోపాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న నల్లగొండ జీఎంసీ కోసం 49, సూర్యాపేట జీఎంసీ కోసం 44 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల అవసరముంది. అనస్థీషియా, అనాటమీ, ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషాలిటీలకు అర్హులైన డాక్టర్ల కొరత ఉంది. ప్రస్తుతం 74 పోస్టులు భర్తీ కాగా మిగిలిన వాటిని డిప్యుటేషన్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో నియమించనున్నారు. ప్రస్తుతం ఎంపి క చేసిన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చారు. -
వర్సిటీ ప్రొఫెసర్లకు పీహెచ్డీ తప్పనిసరి
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రత్యక్ష నియామకానికి పీహెచ్డీని తప్పనిసరి చేసినట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. 2021–22 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని, జాతీయ అర్హత పరీక్ష(నెట్)లో ఉత్తీర్ణతను మాత్రమే ఇకపై ఏకైక అర్హతగా పరిగణించబోమని తెలిపారు. అయితే కళాశాలల్లో నియామకాలకు.. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ లేదా పీహెచ్డీ కనీస అర్హతగా కొనసాగుతుందని సీనియర్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం పీజీ పట్టా కలిగి ఉండి నెట్లో అర్హత సాధించిన వారు లేదా పీహెచ్డీ పట్టా ఉన్న వారు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయవచ్చు. ఇటీవల సవరించిన యూజీసీ నిబంధనలను జవడేకర్ బుధవారం వెల్లడిస్తూ..తీవ్ర వ్యతిరేకత రావడంతో అకడమిక్ పెర్ఫామెన్స్ ఇండికేటర్స్(ఏపీఐ)ని రద్దుచేసినట్లు తెలిపారు. కళాశాల లెక్చరర్లకు పరిశోధనను తప్పనిసరి చేస్తూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2021 నుంచి యూనివర్సిటీల్లో ప్రారంభ స్థాయి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా కూడా పీహెచ్డీ చేసిన వారే ఉంటారని అన్నారు. -
ఆచార్యులకు అడ్డగోలు ‘పరీక్ష’!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: యూజీసీ నిబంధనలు, రోస్టర్ పాయింట్లు, యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ.. అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థుల ఆందోళన ఉధృతమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షపై ఇప్పటికే కొంతమంది కోర్టులను ఆశ్రయించగా మరికొంతమంది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సన్నద్ధమయ్యారు. అసంబద్ధ పద్ధతి అంటున్న అభ్యర్థులు రాష్ట్రంలో మొత్తం 13 యూనివర్సిటీల్లో 1190 ఖాళీలకు డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో వర్సిటీల్లో నియామకాలన్నీ యూజీసీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ విధానంలో జరిగేవి. అయితే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ అసెంబ్లీలో హడావుడిగా తీర్మానం చేసింది. ఈ మేరకు అభ్యర్థులకు ఈ నెల 9 నుంచి 13 వరకు ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. ఇందులో ఇచ్చిన ప్రశ్నపత్రాలు చూసిన అభ్యర్థులు.. ఆన్లైన్ ద్వారా అధ్యాపకులను ఎంపిక చేయడాన్ని అసంబద్ధమైన పద్ధతిగా తేల్చిచెబుతున్నారు. అనేక తప్పుల తడకలతో, సిలబస్ను అతిక్రమించి ప్రశ్నపత్రాన్ని క్లిష్టంగా రూపొందించారని అంటున్నారు. భాషా సబ్జెక్టుల అభ్యర్థులకు తీవ్రనష్టం ఆన్లైన్ పరీక్షలో భాషా సబ్జెక్టులు కూడా ఉన్నాయి. తెలుగు, సంస్కృతం, హిందీతోపాటు తమిళం, కన్నడం భాషా సబ్జెక్టుల అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటి పేపర్కు సంబంధించి ఇంగ్లిష్లో మాత్రమే ప్రశ్నపత్రం ఇచ్చారు. వాస్తవానికి ఇంగ్లిష్తోపాటు మాతృభాషలో కూడా పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలి. తెలుగు సహాయ ఆచార్యుడి ఉద్యోగానికి ఆంగ్లంలో పరీక్ష నిర్వహించడమేమిటన్న ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నిర్వహించే పరీక్షల్లో కూడా ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తుంటే ఇక్కడ ఒక్క ఇంగ్లిష్లోనే ప్రశ్నపత్రం ఇవ్వడంతో తాము నష్టపోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. లైఫ్ సైన్సెస్కు జరిగిన స్క్రీనింగ్ టెస్టులో సుమారు పది సబ్జెక్టు (బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మెరైన్ సైన్సెస్ తదితర)లకు కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారు. ఏ సబ్జెక్టుకు అనుగుణంగా ఆయా సబ్జెక్టు ప్రశ్నలు ఇవ్వాల్సి ఉండగా, అన్నింటికీ కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రం రూపకల్పన సరిగా లేదు సాధారణంగా 50 నుంచి 60 శాతం ప్రశ్నలను అందరూ రాసే విధంగా, మిగిలిన 40 శాతం ప్రశ్నలను కొంత కఠినంగా ఇస్తుంటారు. కానీ ఏపీపీఎస్సీ ఇచ్చిన ప్రశ్నపత్రం సివిల్స్ ప్రశ్నపత్రం కంటే కఠినంగా, కేవలం వడపోతే లక్ష్యంగా ఉన్నట్టు ఉంది. అదేవిధంగా పరీక్షలకు కనీసం 40 రోజుల గడువును ఇవ్వాలనే విషయాన్ని మరిచి పరీక్ష నిర్వహించారు. ఆన్లైన్ పరీక్షలపై అవగాహన కల్పించే విధంగా మాక్ టెస్ట్లు నిర్వహించలేదు. –డాక్టర్ ఎం.వి. మణివర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏయూ లోపభూయిష్టంగా పరీక్ష నిర్వహణ నెగెటివ్ మార్కులు పెట్టడంతో అధిక శాతం మంది అర్హత సాధించలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్ పరీక్షకు సైతం నెగెటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నల్లో అనేక తప్పులు దొర్లాయి. వీటికి ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాల్సి ఉంది. పరీక్ష నిర్వహణ మొత్తం లోపభూయిష్టంగా ఉంది. –ఆరేటి మహేశ్, పరిశోధకులు, ఆంధ్రా విశ్వవిద్యాలయం పరీక్ష రద్దు చేయాలని గవర్నర్కు వినతి ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డాక్టరేట్స్, రీసెర్చ్ స్కాలర్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుళ్లి చంద్రశేఖర్ యాదవ్ శనివారం గవర్నర్ నరసింహన్కు విజ్ఞప్తి చేశారు. విశాఖ విచ్చేసిన గవర్నర్ను శనివారం సర్క్యూట్ గెస్ట్హౌస్లో కలిసి వినతిపత్రం అందించారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ నిరంకుశంగా పరీక్ష నిర్వహించడం అన్యాయమన్నారు. హైకోర్టులో కేసులు ఉండగా పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement