హాయ్, నేను సీజేఐని... క్యాబ్‌కు రూ.500 పంపండి! | Scammer impersonates CJI Chandrachud asking money | Sakshi
Sakshi News home page

హాయ్, నేను సీజేఐని... క్యాబ్‌కు రూ.500 పంపండి!

Aug 29 2024 5:11 AM | Updated on Aug 29 2024 5:11 AM

Scammer impersonates CJI Chandrachud asking money

స్కామర్‌ బరితెగింపు 

ఫిర్యాదు చేసిన సుప్రీంకోర్టు 

న్యూఢిల్లీ: సైబర్‌ నేరగాళ్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా వదలడం లేదు. సీజేఐ పేరిట ఒక వ్యక్తిని రూ.500 అడిగారు! సదరు స్కామర్‌ తనను తాను సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌గా చెప్పుకున్నాడు. ‘‘హలో! నేను సీజేఐని. కొలీజియం అత్యవసర భేటీకి వెళ్లాల్సి ఉంది. కన్నాట్‌ ప్లేస్‌లో చిక్కుకున్నాను. క్యాబ్‌ కోసం రూ.500 పంపగలరా! కోర్టుకు చేరగానే తిరిగి పంపిస్తా’’ అంటూ మెసేజ్‌ చేశాడు.

 అది నిజమైందేనని నమ్మించడానికి ఐ పాడ్‌ నుంచి పంపుతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అయితే దాన్నిండా స్పెల్లింగ్, వ్యాకరణ దోషాలే ఉండటం విశేషం! ఈ నకిలీ మెసేజ్‌ వైరల్‌గా మారింది. దాన్ని కైలాశ్‌ మేఘ్వాల్‌ అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఫ్రెండ్స్, ఏం చేద్దాం మరి!’ అంటూ కామెంట్‌ చేశారు. ఈ వైరల్‌ పోస్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీజేఐ ఆదేశాల మేరకు సైబర్‌ క్రైమ్స్‌కు ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement