Delhi: కేంద్ర కేబినెట్‌ చివరి భేటీ నేడు | PM Modi To Give Farewell Party To His Cabinet Colleagues, Details Inside - Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్‌ చివరి భేటీ.. మంత్రులకు ప్రధాని వీడ్కోలు పార్టీ

Published Sun, Mar 3 2024 8:59 AM

Pm Modi To Give Farewell Party To His Cabinet Colleagues - Sakshi

సాక్షి,ఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ భేటీ ఆదివారం(మార్చ్‌ 3) జరగనుంది. పార్లమెంట్‌ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్‌ విడుదలవనుండడంతో ఈ ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ భేటీలో కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పలకనున్నారు. వారికి ప్రధాని వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు.  

మూడవసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధాని మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లమాటిక్ ఎనక్లేవ్‌లోని సుష్మా స్వరాజ్ భవన్‌లో తుది కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ నెలలోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌(సీఈసీ) షెడ్యూల్ విడుదల చేయనుంది. 

ఇదీ చదవండి.. వచ్చే వారంలో కాంగ్రెస్‌ కీలక భేటీలు

Advertisement
Advertisement