‘నేరస్థులు ఎవ్వరైనా సరే.. వారిని విడిచి పెట్టం’ | PM Modi On Crime Against Women | Sakshi
Sakshi News home page

‘నేరస్థులు ఎవ్వరైనా సరే.. వారిని విడిచి పెట్టం’

Aug 25 2024 4:49 PM | Updated on Aug 25 2024 9:04 PM

PM Modi On Crime Against Women

ముంబై : దేశంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. కోల్‌కతా ఆర్‌జీకార్‌, బద్లాపుర్‌ పాఠాశాల లైంగిక వేధింపుల ఘటనలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న వేళ  మోదీ వ్యాఖ్యానించారు. 

మహరాష్ట్రలోని లఖ్‌పతి దీదీ కార్యక్రమంలో మహిలలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మోదీ ప్రసంగించారు. నేను అన్నీ రాష్ట్రాలకు చెబుతున్నా. మహిళలపై దారుణాలకు ఒడిగట్టే నేరస్థులు ఎవ్వరైనా సరే ఉపేక్షించవద్దు. త్వరలో చట్టాల్ని మరింత పటిష్టపరుస్తున్నాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement