
జమ్ము కశ్మీర్ అనంత్నాగ్ జిల్లా పహల్గాం బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ రలిగిపోతోంది. అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను బలిగొన్నందుకు పాక్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తోంది. ఈ క్రమంలో.. త్వరలోనే దీటైన ప్రతీకారం తప్పదని భారత ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు.. దౌత్యపరమైన ఆంక్షలతో పాక్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
కాసేపట్లో అఖిలపక్ష సమావేశం
- కాసేపట్లో అఖిలపక్ష సమావేశం
- రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలో సమావేశం
- అన్నీ రాజకీయ పార్టీలను ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం
- పహల్గాం ఉగ్రదాడితో తీసుకున్న చర్యలను అఖిల పక్ష పార్టీలకు వివరించనున్న కేంద్రం
- వైఎస్సార్సీపీ తరుఫున హాజరుకానున్న పెద్దిరెడ్డి మిథున్రెడ్డి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర మంత్రుల భేటీ
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్రమంత్రి అమిత్షా,జైశంకర్లు భేటీ
- ఉగ్రదాడి,భారత్ చర్యలను వివరించిన కేంద్ర మంత్రులు
- దేశభద్రత,పాక్పై దౌత్యపరమైన చర్యలపై కీలక చర్చ
విదేశీ దౌత్యవేత్తలతో భారత విదేశాంగ శాఖ అధికారులు భేటీ
- విదేశీ దౌత్యవేత్తలతో భారత విదేశాంగ శాఖ అధికారులు భేటీ
- జర్మనీ,జపాన్,బ్రిటన్,రష్యా దౌత్యవేత్తలతో భేటీ
- ఉగ్రదాడి ఘటనను విదేశీ దౌత్యవేత్తలకు వివరించిన అధికారులు
ఉగ్రదాడిని ఖండించిన సీడబ్ల్యూసీ
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ
నిఘా వ్యవస్థ వైఫల్యంగా తీర్మానించిన సీడబ్ల్యూసీ
- ఉగ్రదాడికి నిరసనగా దేశవ్యాప్తంగా రేపు కొవ్వొత్తుల ర్యాలీ
- దేశవ్యాప్తంగా రేపు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ పిలుపు
- ఏఐసీసీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్లో ఈరోజు జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీ రేపటికి వాయిదా
ఉగ్రవాదులకు ప్రధాని మోదీ ఘాటుహెచ్చరిక
పహల్గాం ఉగ్రదాడిపై పబ్లిక్ మీటింగ్లో స్పందించిన ప్రధాని మోదీ
గురువారం బీహార్ పాట్నాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ
పహల్గాం మృతులకు నివాళి అర్పిస్తూ.. రెండు నిమిషాలు మౌనం పాటించిన ప్రధాని
ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తాం: ప్రధాని మోదీ
ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు
భారత్ ఆత్మపై జరిగిన దాడి
అమాయకులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు
బాధితుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు
వాళ్లందరినీ సంఘీభావం తెలపాల్పిన అవసరం ఉంది
ఉగ్రవాదులకు తగిన గుణపాఠం నేర్పుతాం
ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే
Listen at your own risk....🔊🔊
This is very clear warning to everyone....🔥🔥#ModiSangMithila #PahalgamTerroristAttack #PanchayatiRajDiwas #Modi #BJP #NarendraModi pic.twitter.com/JXBHAyukyI— Bhavya Mishra (Modi ka Parivaar) (@bhavyamishra108) April 24, 2025
పహల్గాంలో ఆ 10 నిమిషాలు మారణహోమం
- పహల్గాంలో పది నిమిషాలపాటు మారణహోమం
- ఐడీ కార్డులు అడిగి మరీ కాల్చి చంపిన ఉగ్రవాదులు
- ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నాం 2గం. దాకా కొనసాగిన కాల్పులు
- హెల్మెట్లకు ఉన్న కెమెరాలతో ఆ ఘోరాన్ని చిత్రీకరించిన టెర్రరిస్టులు
- 2.30గం. కశ్మీర్ పోలీసులకు ఘటనపై సమాచారం
- ఆ తర్వాత ఘటనాస్థలానికి వచ్చిన ఆర్మీ
- సైనికులకు చూసి వణికిపోయిన టూరిస్టులు
- ఆర్మీ దుస్తుల్లోనే కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
- టెర్రరిస్టుల కాల్పుల్లో మరణించిన 26 మంది పర్యాటకులు
- పురుషులనే టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు
- చనిపోయిన వాళ్లలో ఐబీ, నేవీ, ప్రభుత్వాధికారులే అధికం
తెలంగాణ టూరిస్టులు సురక్షితం
ఉగ్రదాడి తర్వాత.. నిన్నంతా హోటల్కే పరిమితమైన తెలంగాణ పర్యాటకులు
ఏం జరుగుతుందో అర్థంకాక బంధువుల్లో ఆందోళన
ఇవాళ బయటకు వచ్చి జరిగిన దాడిని మీడియాతో పంచుకున్న పలువురు
హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా సురక్షితంగా ఉన్నట్లు బంధువులకు సమాచారం
హోం శాఖ హైలెవల్ మీటింగ్
- కొనసాగుతున్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమావేశం
- పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మీటింగ్
- సమావేశంలో పాల్గొన్న హోంశాఖ కార్యదర్శి, ఐబీ డైరెక్టర్, ‘రా’ చీఫ్
ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ
- పహల్గాం ఉగ్రదాడిపై సీడబ్ల్యూసీ చర్చ
- సమావేశానికి హాజరైన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, జైరాం రమేష్
- అమెరికా పర్యటన ముగించుకుని అర్ధాంతరంగా వచ్చిన రాహుల్
- ఉగ్రదాడిపై అమిత్ షాతో ఇప్పటికే ఫోన్లో మాట్లాడిన రాహుల్ గాంధీ
- సాయంత్రం అఖిలపక్ష భేటీకి హాజరయ్యే అవకాశం
కశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ వాళ్ల కోసం హెల్ప్లైన్ నెంబర్లు
- కశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- 9440816071, 9010659333, 040 23450368
- కశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు: జూపల్లి కృష్ణారావు
- ఇటీవల జమ్మూకశ్మీర్ వెళ్లినవారి వివరాలు ఇవ్వాలని టూర్ ఆపరేటర్లకు ఆదేశాలు
పాక్ మిలిటరీ దౌత్యవేత్తకు భారత్ సమన్లు
- పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు ‘పర్సోనా నాన్ గ్రాటా’ జారీ
- ఈ నోటీసుల ప్రకారం ఒక వారంలో వారు దేశాన్ని వీడాల్సి ఉంటుందని తెలిపిన భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
ఢిల్లీలో పాక్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
- ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసన ప్రదర్శనలతో ఉద్రిక్తత
- హిందూ సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు
- పాకిస్తాన్ నశించాలి అంటూ నినాదాలు
- ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ ను నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్
- సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్
వక్రబుద్ధి బయటపెట్టిన పాక్
- పహల్గాం ఉగ్రదాడిపై సంబురాలు చేసుకున్న పాక్?
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి కేక్ తీసుకెళ్లిన పాక్ ప్రతినిధి
- ఎందుకు అని ప్రశ్నించిన మీడియాకు సమాధానం చెప్పని వైనం
పీవోకేలో భారత ఆర్మీ వ్యూహరచన
- పీవోకే వెంట 42 చోట్ల ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు
- పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ దృష్టి
- వ్యూహ రచనను రక్షణ మంత్రి రాజ్నాథ్కు వివరించిన ఆర్మీ
పాక్ ఎక్స్ ఖాతా నిలిపివేత
- ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ప్రభుత్వ ఎక్స్ ఖాతా నిలిపివేసిన భారత్
- దౌత్యపరమైన ఆంక్షల్లో భాగంగానే ఈ చర్య
భద్రతా వలయంలో పహల్గాం
- మంగళవారం పహల్గాం బైసరన్ వ్యాలీ పిక్నిక్ స్పాట్లో ఉగ్రదాడి
- సైనిక దుస్తుల్లో వచ్చిన గుర్తింపు తనిఖీలు చేసి మరీ పర్యాటకులను కాల్చి చంపిన టెర్రరిస్టులు
- 26 మంది స్పాట్లో.. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి
- తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరికొందరు
- ప్రశాంత లోయలో ఉగ్రదాడితో ఉలిక్కి పడ్డ భారత్
- నాటి నుంచి భద్రతా వలయంలో పహల్గాం
- హోటల్స్, లాడ్జిలను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న భద్రతా బలగాలు
పాక్ హైకమిషనర్కు కేంద్రం సమన్లు
- వారంలోగా భారత్ విడిచిపోవాలని అల్టిమేటం
- దౌత్యవేత్త అహ్మద్ వారైజ్తో పాటు పలువురు సిబ్బందికి కేంద్ర నోటీసులు జారీ
- హైకమిషనరేట్ కార్యాలయం ముందు బారికేడ్లను తొలగించిన సిబ్బంది
- ఆఫీస్లోని సామాగ్రి సైతం తీసుకెళ్తున్న సిబ్బంది
క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాక్
- కరాచీ తీరంలో క్షిపణి పరీక్షలు నిర్వహణకు పాక్ ప్రభుత్వ ఆదేశాలు
- పాక్ చర్యలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్
ఉదమ్పూర్ ఉగ్రవాదుల దుశ్చర్య
- ఉదమ్పూర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు
- ఆర్మీ జవాను మృతి చెందినట్లు ప్రకటించిన భారత సైన్యం
- కొనసాగుతున్న ఎదురు కాల్పులు