
India-Pakistan War Updates:
పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడుతోంది. శుక్రవారం(మే9వ తేదీ) రాత్రి కాగానే పాకిస్తాన్ మళ్లీ భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఎల్ఓసీలో పాక్ సైన్యం కాల్పులకు దిగడమే కాకుండా, డ్రోన్లను ప్రయోగిస్తూ సరహద్దు ప్రాంతాల్లో దాడులకు దిగింది. వీటిని భారత్ రక్షణ వ్యవస్థ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది.
జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లను భారత్ సైన్యం కూల్చివేసింది. దాంతో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.
శ్రీనగర్ లో భారీ పేలుడు శబ్దాలు
పాక్ దాడులు.. ఇప్పటివరకూ దాయాదికి చెందిన 100 డ్రోన్లను కూల్చివేసిన భారత్
ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన కీలక సమావేశం
సమావేశంలో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్
సమావేశానికి హాజరైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు
తాజా పరిణామాలను మోదీకి వివరించిన త్రివిధ దళాధిపతులు
ఢిల్లీ :
జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలపై డ్రోన్లు,మిస్సైల్స్ తో భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ దాడులు
పాక్ డ్రోన్లను గగనతలం లో నిలువరిస్తున్న భారత రక్షణ వ్యవస్థ
కొనసాగుతున్న బ్లాక్ అవుట్
సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేస్తున్న భద్రతా బలగాలు
ఎల్ వో సి వద్ద కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘిస్తూ భారీగా కాల్పులు
పాక్ కాల్పులను తిప్పి కొడుతున్న భారత సైన్యం
ఒమర్ అబ్దుల్లా ట్వీట్
కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్
ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి: ఒమర్ అబ్దుల్లా
It’s my earnest appeal to everyone in & around Jammu please stay off the streets, stay at home or at the nearest place you can comfortably stay at for the next few hours. Ignore rumours, don’t spread unsubstantiated or unverified stories & we will get through this together.
— Omar Abdullah (@OmarAbdullah) May 9, 2025
ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం
హాజరైన నేవీ చీఫ్, జాతీయ భద్రతా సలహాదారు
సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై చర్చ

సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్
భారత్ - పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
జమ్మూకశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్
వరుసగా రెండో రోజు చీకటి పడగానే డ్రోన్ దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్
పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్
యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ కాల్పులు
ఫిరోజ్పూర్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్
జైసల్మీర్, యూరీలో మోగిన సైరన్లు, బ్లాకౌట్

ఎల్వోసీలో మళ్లీ పాక్ సైన్యం కాల్పులు
యూరీ సెక్టార్ హెవీ షెల్లింగ్
పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం
ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ
ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.
నేవీ చీఫ్, జాతీయ భద్రతా సహదారు తాజా పరిణామాలను వెల్లడించారు.
సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు.
విశాఖ:
విశాఖలో అప్రమత్తమైన బలగాలు
కేంద్ర హోం శాఖ ఆదేశాలతో.. విశాఖ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత పెంపు
ప్రతి ఒక్క ప్రయనికుడుని పూర్తిగా తనిఖీ చేస్తున్న CISF సిబ్బంది
విమానాశ్రయం ఎంట్రీ లోనే చెకింగ్ చేస్తున్న CISF బలగాలు
ఆపరేషన్ సిందూర్పై విదేశాంగ శాఖ మీడియా సమావేశం
గత రాత్రి పాక్.. సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసింది
300 నుంచి 400 వరకూ డ్రోన్లను ప్రయోగించింది
ఎల్ఓసీ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది
జమ్మూ, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ లక్ష్యంగా పాక్ దాడులు చేసింది
జమ్మూలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు
34 చోట్ల పాక్ దాడులకు పాల్పడింది
పాక్ దాడులను తిప్పికొట్టాం
పౌర విమానాలను టార్గెట్ గా పాక్ దాడులు చేసింది
ఆ డ్రోన్లు టర్కీకి చెందినవి తెలుస్తోంది
లేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించింది
బటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారు
కశ్మీర్లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడింది
భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్పై దాడికి యత్నించారు
లేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించింది
బటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారు
కశ్మీర్లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడింది
భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్పై దాడికి యత్నించారు
పాక్ ఉపయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవి
పాక్ సైన్యం కాల్పుల్లో అనేకమంది గాయపడ్డారు.
పాక్ దాడులను భారత వాయుసేన సమర్థవంతంగా అడ్డుకుంది
కర్తర్పూర్ కారిడార్ ను తాత్కాలికంగా మూసివేశాం
అమృత్సర్లో పాక్ బాంబును నిర్వీర్యం చేసిన ఇండియన్ ఆర్మీ
మక్నా దిండి విలేజ్ను టార్గెట్ చేసిన పాకిస్తాన్
బాంబును నిర్వీర్యం చేసిన భారత సైనికులు
సరిహద్దుల్లో పాక్ దాడిని తిప్పికొడుతున్న భారత సైన్యం
తిరుమల
భారత్- పాక్ యుద్ద వాతావరణం నేపథ్యంలో తిరుమలలో భద్రత బలగాలు మాక్ డ్రిల్
..తిరుమల ప్రవేశ మార్గంలో ఆక్టోపస్, పోలీస్, విజిలెన్స్, ఇతర బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహణ
ఢిల్లీ:
అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ లేఖ
సివిల్ డిఫెన్స్ రూల్స్ కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశం
అత్యవసర సమయంలో కావలసిన అన్ని వస్తువులను సేకరణకు అనుమతిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచిస్తున్న 1968 సివిల్ డిఫెన్స్ రూల్స్
ఢిల్లీ ;
ఢిల్లీలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్
ఐటీఓ వద్ద టెస్ట్ సైరెన్ చేసిన అధికారులు
వైమానిక దాడి సైరన్లను పరిశీలించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పరవేశ్ వర్మ
8 కి.మీ వరకు వినిపించేలా సైరన్ ఏర్పాటు
అమరావతి:
ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న ఏపీ సచివాలయ ఉద్యోగులు
అమరుడైన మురళి నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు
పాక్స్తాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్
జమ్మూకశ్మీర్, రాజస్తాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీ
ఢిల్లీ, హరియాణా, హిమాచల్లోనూ భద్రత కట్టుదిట్టం
పోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసిన సరిహద్దు రాష్ట్రాలు
గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం
కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
అవసరమైతే టరిటోరియల్ ఆర్మీని పిలిపించుకునేందుకు అనుమతి
ఆర్మీ చీఫ్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన రక్షణమంత్రి రాజ్ నాథ్
టెరిటోరియల్ ఆర్మీలో ధోనీ, మోహన్లాల్, సచిన్ పైలట్, అనురాగ్ ఠాకూర్
దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంపు
భద్రతను రెండోస్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు
పోర్టులు, టర్మినళ్లు, నౌకలకు భద్రత పెంచిన కేంద్రం
ఇస్రో కేంద్రాల దగ్గర హైఅలర్ట్
ఇస్రో కేంద్రాల దగ్గర సీఐఎస్ఎఫ్ భద్రత పెంపు
శ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో అలర్ట్
పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం
ప్రయాణికులు విమానయాన శాఖ అడ్వైజరీ
ఎయిర్పోర్ట్లకు మూడు గంటల ముందుగానే చేరుకోవాలి
75 నిమిషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ అవుతుంది
జాతీయ రక్షణ నిధికి తెలంగాణ నేతల విరాళం
నెల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచన
నెల వేతనం విరాళంగా ప్రకటించనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు మెయిల్
అప్రమత్తమైన అధికారులు
ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు
సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్
గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సీఎంలతో మాట్లాడిన మోదీ
సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని సూచన
ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ
ఢిల్లీ:
అమిత్ షా నివాసంలో హైలెవల్మీటింగ్
హాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు
సరిహద్దుల్లో పరిస్థితులపై అమిత్ షా రివ్యూ
ఢిల్లీ:
ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ భేటీ
పాక్ పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చ
బ్యాంకులు, ఆర్థిక సంస్థల భద్రతపై నిర్మలా సీతారామన్ రివ్యూ
సైబర్ భద్రత సన్నద్ధతపై సమీక్షించనున్న నిర్మాలా సీతారామన్
పాక్ పార్లమెంట్ లో రక్షణ మంత్రి అసిఫ్ కీలక వ్యాఖ్యలు
మన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలం
పాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది
మన రక్షణ విభాగం పూర్తి విఫలమైంది
పాక్ ప్రభుత్వంపై ఎంపీలు విమర్శలు
చేతగాని ప్రభుత్వం అంటూ మండిపాటు
👉కాసేపట్లో ప్రధాని మోదీతో రాజ్నాథ్ భేటీ
పాక్పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చ
ఉదయం త్రివిధ దళాధిపతులతో రెండున్నర గంటల పాటు భేటీ
అమిత్షా అత్యున్నతస్థాయి సమావేశం
హాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు
సరిహద్దు పరిస్థితులపై అమిత్షా సమీక్ష
👉పాకిస్థాన్కు దెబ్బ మీద దెబ్బ
ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలు
మరో పక్క బీఎల్ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరి
తెహ్రిక్ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతం
👉జమ్మూకశ్మీర్ లో తెలుగు జవాన్ వీర మరణం
భారత్-పాక్ యుద్ధభూమిలో మురళీ నాయక్ మృతి
జవాన్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితండా గ్రామం
👉ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
ఐపీఎల్ నిరవధిక వాయిదా వేసిన బీసీసీఐ
భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం
👉జమ్మూ కశ్మీర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యే రైళ్లు
పాకిస్థాన్ సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్
ఇండియా గేట్, వార్ మెమోరియల్ వద్ద భద్రత కట్టుదిట్టం
సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచన
బోర్డర్ వెళ్లిన 10 మంది పంజాబ్ మంత్రులు
దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఆదేశాలు
👉జమ్మూలో భద్రతా బలగాల భారీ ఆపరేషన్
సాంబా సెక్టార్లో ఏడుగురు అనుమానిత ఉగ్రవాదుల హతం
చైనా తయారీ పీఎల్-15 మిస్సైల్ను కూల్చేసిన భద్రతా బలగాలు
పంజాబ్ పంట పొలాల్లో కూలిన పీఎల్-15 మిస్సైల్
భారత్ భీకర దాడులతో పాక్ కకావికలం
కంటోన్మెంట్లను ఖాళీ చేస్తున్న పాక్ ఆర్మీ కుటుంబాలు
👉చండీగఢ్లో మోగిన సైరన్లు
ప్రజలు ఇళ్లలోనే ఉండాలి
దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన ఎయిర్ ఫోర్స్
సరిహద్దులో ఉద్రిక్తతలపై రాజ్నాథ్ సింగ్ సమీక్ష
ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్న రక్షణ మంత్రి
తదనంతర వ్యూహాలపై చర్చిస్తున్న రాజ్నాథ్ సింగ్
👉అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన
భారత్ - పాక్ యుద్ధం మధ్యలో మేం జోక్యం చేసుకోం
ఇది మాకు సంబంధం లేని విషయం
ఆయుధాలు పక్కన పెట్టమని మేము ఎవరిని కోరం
ఏదైనా ఉంటే దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తాం
ఈ ఘర్షణలు అణు యుద్ధానికి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాం

👉ఢిల్లీలో హైఅలర్ట్.. ఇండియా గేట్ దగ్గర భద్రత పెంపు
ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేత
ఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలు బంద్
👉కాసేపట్లో సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ
పాకిస్థాన్ దాడులు, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించనున్న రక్షణ మంత్రి
జమ్మూ చేరుకున్న సీఎం ఒమర్ అబ్ధుల్లా
పరిస్థితిని సమీక్షిస్తున్న ఒమర్ అబ్ధుల్లా
హోంమంత్రి అమిత్షాతో బీఎస్ఎఫ్ చీఫ్ భేటీ
👉ఆపరేషన్ సిందూర్.. పాక్ దాడులపై ఇండియన్ ఆర్మీ ప్రకటన
పాకిస్థాన్ సాయుధ దళాలు నిన్న మధ్య రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామగ్రితో అనేక దాడులను చేశాయి.
జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాల్పడ్డాయి
డ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి
భారత సైన్యం దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉంది
దుర్మార్గపు కుట్రలకు దీటుగా స్పందిస్తాం
👉పాకిస్థాన్లో మరోసారి బలూచిస్థాన్ ఆర్మీ దాడి
హజారా, క్వెట్టాపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కాల్పులు
👉పాకిస్థాన్లో అంతర్గత సంక్షోభం
పాకిస్తాన్ వ్యాప్తంగా పీటీఐ నిరసన ర్యాలీలు
ప్రధాని షెహబాజ్ అసమర్థ ప్రధాని అంటూ నినాదాలు
ఇప్పటికే సురక్షిత ప్రాంతానికి పారిపోయిన షెహబాజ్
👉ఆపరేషన్ సింధూర్ .3.o పై ఉదయం 10 గంటలకి మీడియా సమావేశం
రాత్రి నిర్వహించిన దాడులపై బ్రీఫింగ్
కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి, ఆర్మీ ప్రతినిధుల మీడియా బ్రీఫింగ్
జమ్ము సరిహద్దు గ్రామాల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటన
పాకిస్తాన్ కాల్పుల్లో చనిపోయిన గాయపడిన కుటుంబాలను పరామర్శించనున్న ఒమర్
👉నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలు
పాక్ దాడులు, భారత్ ప్రతిదాడులపై ప్రధాని మోదీ సమీక్షసరిహద్దులతో పరిస్థితులపై అజిత్ ధోవల్తో చర్చ
సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీ
పాకిస్థాన్పై కౌంటర్ ఎటాక్ దిగిన భారత్
లాహోర్, సియాల్కోట్, కరాచీపై భారత్ ప్రతిదాడి
జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లో హై అలర్ట్
ఆరేబియా సముద్రంలో భారత నౌకాదళం గర్జన
పాక్పై గురిపెట్టిన 26 యుద్ధనౌకలు
పాక్లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసిన ఇండియన్ నేవీ
ఇప్పటికే కరాచీ సీ పోర్టును ధ్వంసం చేసిన భారత్ నేవీ

👉సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్ ఫైటర్ జెట్లు భారత్పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్ మొదలుకుని జమ్మూ కశ్మీర్ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి.
👉శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది.
👉మన ‘ఆకాశ్’, ఎంఆర్ఎస్ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్కోట్లో రెండు, జమ్మూలో ఒక పాక్ యుద్ధ విమానాన్ని ఎస్–400 వ్యవస్థ నేలకూలి్చంది. వాటిలో రెండు జేఎఫ్–17, ఒక ఎఫ్–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్ కూడా అంగీకరించింది. పఠాన్కోట్లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్పై సైన్యం విరుచుకుపడింది.
👉ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, కరాచీ, రావలి్పండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్ తదితర నగరాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్లోని పంజాబ్ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్)ను తుత్తునియలు చేసింది. పాక్ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచి్చతత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.

👉సరిహద్దు భద్రతా చీఫ్లతో అమిత్ షా భేటీ
ఇరువైపులా పరస్పర దాడుల వేళ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సహా వేర్వేరు సరిహద్దు భద్రతా చీఫ్లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) బలగాల అధినేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంట తాజా పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల వద్ద భద్రతా పరిస్థితులపై సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చీఫ్తో అమిత్ షా చర్చించారు. ఇండో–పాక్ సరిహద్దుసహా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట భద్రతను బీఎస్ఎఫ్ బలగాలు చూసుకుంటున్నాయి. ఇక చైనాతో సరిహద్దు వెంట పహారా బాధ్యతలను ఐటీబీపీ, నేపాల్, భూటాన్లతో సరిహద్దు భద్రతను సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ) బలగాలు పర్యవేక్షిస్తున్న విషయం విదితమే.