ట్రంప్‌-మునీర్ భేటీపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు | Jammu And Kashmir CM Omar Abdullah Comments On Donald Trump And Pak Army Chief Asif Munir Lunch | Sakshi
Sakshi News home page

ట్రంప్‌-మునీర్ భేటీపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

Jun 21 2025 8:16 AM | Updated on Jun 21 2025 10:23 AM

Omar Abdullah on Trump Munir Lunch

శ్రీనగర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- పాక్‌ సైన్యాధ్యక్షుడు అసిఫ్‌ మునీర్‌ల లంచ్‌ భేటీపై దుమారం చెలరేగుతోంది. ఈ అంశంపై తాజాగా 
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా  స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా తన ప్రయోజనాలను పొందేవరకు మాత్రమే ఇతర దేశాలతో స్నేహం చేస్తుందని, వాషింగ్టన్ తనను తాను కాపాడుకునేందుకు ఏదైనా చేస్తుందని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు వైట్ హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘అమెరికా అధ్యక్షుడు తన  ఇష్టాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఎవరిని విందుకు ఆహ్వానించాలో, ఎవరిని ఆహ్వానించకూడదో మనం ఆయనకు చెప్పగలమా? అమెరికా అధ్యక్షుడు మనకు  ప్రత్యేకమైన స్నేహితుడు అని మనం భావిస్తుంటాం. ఆయన మన స్నేహాన్ని గౌరవిస్తారా లేదా అనేది వేరే విషయం. అమెరికా తన స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది. అవసరం లేనప్పుడు మరే ఇతర దేశాన్ని పట్టించుకోదు’ అని శ్రీనగర్ రైల్వే స్టేషన్‌లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విలేకరులతో అన్నారు. ఆయన తన తండ్రి ఫరూక్ అబ్దుల్లాతో కలిసి వందే భారత్ రైలులో జమ్మూకు వెళ్లారు. ఈ రైలు సేవలను ఆయన కొనియాడారు.

ఇది కూడా చదవండి: International Yoga Day: యోగాభ్యాసంపై కింగ్ చార్లెస్ ఏమన్నారంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement