
న్యూఢిల్లీ: ట్రంప్ దురహంకారాగ్రహానికి గురై 50 శాతం టారిఫ్ భారాన్ని మోస్తున్న భారత్, బ్రెజిల్ దేశాల అగ్రనేతలు గురువారం ఫోన్లో సంభాíÙంచుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డసిల్లా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్చేసి పలుఅంశాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చిన గురువారం రోజే ఇరు దేశాధినేతలు మాట్లాడుకోవడం గమనార్హం.
వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, సాంస్కృతిక సంబంధాల అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారని ప్రధాని కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ మీదనే ప్రధానంగా ఇరునేతలు చర్చించుకున్నారని తెలుస్తోంది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ చర్చకు వచ్చాయి.