సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. అధికార-ప్రతిపక్ష సవాళ్ల నడుమ చివరిరోజు ఉభయ సభల్లో ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠకు ఉత్తినే తెర పడింది. లోక్సభ ప్రారంభం కాకుండానే నిరవధిక వాయిదా పడింది.
గురువారం లోక్సభకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, విపక్ష నేత రాహుల్ గాంధీ సహా అంతా హాజరయ్యారు. ఎలాంటి చర్చకైనా సిద్ధమని కేంద్రం ప్రకటించడం.. నిలదీసి తీరతామని విపక్షాలు ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే వందేమాతర ఆలాపన తర్వాత నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇటు రాజ్యసభ మాత్రం తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
ఆగస్టు 20వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం 18 రోజులపాటు వాయిదాలకే సరిపోయింది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఒక్క పరీక్షా సవరణ బిల్లుపై చర్చ మినహాయించి మరేయితర అంశంపై సరైన చర్చ నడవలేదు. నిరసనల నడుమే కేంద్రం కూడా మూజువాణి ఓటుతో ఏడు బిల్లులకు ఆమోదం తెలపడం గమనార్హం.


