
శ్రీనగర్: జమ్మూకశీ్మర్లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.
బారాముల్లాలోని వాటర్గామ్ ప్రాంతంలో టెర్రరిస్టులు తలదాచుకొన్నారనే సమాచారంతో బుధవారం భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయని, తీవ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ మొదలైందని అధికారవర్గాయి తెలిపాయి. కాల్పుల్లో మరణించిన తీవ్రవాదుల పేర్లు, వారు ఏ సంస్థకు చెందిన వారనే విషయాలను ఆరాతీస్తున్నారు. తీవ్రవాదుల కాల్పుల్లో ఒక పోలీసు, మరో జవానుకు గాయాలయ్యాయని వెల్లడించారు.