
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే దీనికి భిన్నంగా సిక్కిం రాష్ట్రం(Sikkim State)లో ఒక్క కోవిడ్-19 యాక్టివ్ కేసు కూడా నమోదు కాలేదు. కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా డేటాలో ఈ విషయం వెల్లడయ్యింది. దేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య శనివారం నాటికి 3,395కి చేరింది. మే 22న దేశంలో 257 కేసులు ఉండగా మే31 నాటికి ఈ సంఖ్య 3,395కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో 685 కొత్త కేసులు, నాలుగు కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. కేరళలో 1,336 యాక్టివ్ కేసులు), మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375 కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సిక్కింలో ఒక్క యాక్టివ్ ఇన్ఫెక్షన్ కూడా నమోదు కాలేదు.
కేసుల సంఖ్య పెరుగుతున్న ఇతర రాష్ట్రాలలో గుజరాత్ (265), కర్ణాటక (234), పశ్చిమ బెంగాల్ (205), తమిళనాడు (185), ఉత్తర ప్రదేశ్ (117) ఉన్నాయి. పుదుచ్చేరి (41) హర్యానా (26)లు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు కొత్త ఉప-వేరియంట్లు ఎల్ఎఫ్. 7, ఎన్బీ.1.8.1లను పర్యవేక్షణలో ఉన్న వైవిధ్యాలుగా గుర్తించింది. కొన్ని దేశాలలో ఈ వేరియంట్లు కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయని తెలిపింది.
ఇది కూడా చదవండి: ‘నాన్నా.. ద్రోహం జరిగింది’: లాలూకు తేజ్ లేఖ