విజయవాడ: ఏపీలో కోవిడ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. ఇవాళ(శనివారం, జూలై 25వ తేదీ) ఒక్కరోజే 10 మందికి కోవిడ్ బారిన పడ్డారు. దాంతో ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 49కు చేరింది. ఆస్పత్రుల్లో 24 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ముగ్గురికి, ఎన్టీఆర్ జిల్లాలో ఇద్దరికి పాజిటివ్గా తేలింది. ఏపీలో కరోనాతో ఇప్పటివరకూ నలుగురు మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే.


