
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav) మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన తన తల్లిదండ్రులకు.. పార్టీలో తనకు జరిగిన ద్రోహంపై లేఖ రాసి, కలకలం సృష్టించారు. పార్టీ నుంచి తనకు బహిష్కరించిన కొన్నాళ్లు తేజ్ ప్రతాప్ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.
मेरे प्यारे मम्मी पापा....
मेरी सारी दुनिया बस आपदोनों में ही समाई है।भगवान से बढ़कर है आप और आपका दिया कोई भी आदेश।आप है तो सबकुछ है मेरे पास।मुझे सिर्फ आपका विश्वास और प्यार चाहिए ना कि कुछ और।पापा आप नही होते तो ना ये पार्टी होती और ना मेरे साथ राजनीति करने वाले कुछ जयचंद जैसे…— Tej Pratap Yadav (@TejYadav14) May 31, 2025
ఈ లేఖను తేజ్ ప్రతాప్ యాదవ్ తన తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రాశారు. పార్టీలో తనకు జరిగిన ద్రోహం గురించి దానిలో వివరించారు. పార్టీలో జైచంద్ లాంటి ద్రోహులు తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే వీరినే మీరు నమ్ముతున్నారని లాలూపై ఆయన ఆరోపించారు. తనకు కావలసినది తల్లిదండ్రుల ప్రేమేనని పేర్కొన్నారు. ‘నా ప్రియమైన మమ్మీ, డాడీ... నా ప్రపంచం మొత్తం మీ ఇద్దరి చుట్టూనే తిరుగుతుంటుంది. మీరు నాకు దేవుడి కంటే గొప్పవారు. మీ ప్రతి మాట నాకు దేవుని ఆదేశం లాంటిది. మీరు నాతో ఉన్నప్పుడు నాకు అన్నీ ఉన్నాయి. నేను కోరుకునేది మీ నమ్మకం, ప్రేమ. ఇంకేమీ కాదు. నాన్నా.. మీరు లేకుంటే ఈ పార్టీ ఉండేది కాదు. కుట్రా రాజకీయాలు చేసే జైచంద్ వంటి దురాశపరులు కూడా ఉండేవారు కాదు. అమ్మానాన్నలిద్దరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అని తేజ్ ఆ లేఖలో రాశారు.
గతంలో తేజ్ ప్రతాప్.. అనుష్క యాదవ్(Anushka Yadav) అనే మహిళ పక్కన ఉన్న ఫేస్ బుక్ ఫోటోవైరల్గా మారింది. 12 ఏళ్లుగా వీరి మధ్య సంబంధం ఉంటుంటూ సోషల్ మీడియలో కథనాలు వచ్చాయి. ఇది పార్టీని అంతర్గతంగా ఇబ్బందులలోకి నెట్టివేసింది. ఈ నేపధ్యంలో తేజ్ ప్రతాప్ను ఆరేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి స్పందించిన తేజ్ ప్రతాప్.. తన ఫేస్బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, ఆ ఫొటో నకిలీదని, తనను అప్రతిష్టపాలు చేసే ప్రచారంలో భాగంగా ఇలా చేశారని పేర్కొన్నారు. ఈ వివాదం బీహార్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
ఇది కూడా చదవండి: COVID-19: పిల్లలను స్కూళ్లకు పంపొద్దు: కర్నాటక ప్రభుత్వం