సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 50కు చేరుకుంది. మంగళవారం కాకినాడ జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. ప్రస్తుతం 32 యాక్టివ్ కేసులు ఉండగా వీరిలో 25 మంది బాధితులు హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. ఏడుగురు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు వైరస్ బారినపడ్డ నలుగురు బాధితులు మృత్యువాతపడ్డారు. మరో 14 మంది కోలుకున్నారు.


