భారత దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద జరిగే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని హోదాలో ఆయనకిది ఈ వేడుకలకు ప్రాతినిధ్యం వహించడం 13వ సారి.
అప్డేట్స్..
ఎర్రకోట చేరుకున్న ప్రధాని
- దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు
- రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని
- అనంతరం ఎర్రకోటకు చేరిక
- త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసులు గౌరవ వందనం ప్రధాని స్వీకరిస్తున్నారు
మువ్వన్నెల జెండా ఆవిష్కరణ.. 21 గన్ సెల్యూట్
ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా 21 గన్ సెల్యూట్, జాతీయ గీతాలాపన, సైనిక గౌరవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
👉ఈ ఏడాది వేడుకల్లో ‘వందేమాతరం’కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జాతీయ గీతం వందేమాతరం 150 ఏళ్ల వారసత్వాన్ని గుర్తు చేస్తూ తొలిసారి ఎర్రకోట అధికారిక కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు.
👉‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనలో యువశక్తి పాత్రను ఈసారి వేడుకల్లో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ప్రధాని.. వారి స్ఫూర్తితో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.


