ఎండలతో బీ కేర్‌ఫుల్‌ ..ఐఎండీ తాజా వార్నింగ్‌ | Sakshi
Sakshi News home page

ఎండలతో జాగ్రత్త..ఐఎండీ తాజా వార్నింగ్‌

Published Fri, Apr 26 2024 7:46 PM

Imd Latest Alert On Heat Wave

న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో ఎండలు మరింతగా మండుతాయని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్‌26) అలర్ట్‌ జారీ చేసింది.  

తూర్పు,దక్షిణ భారతాల్లో రానున్న ఐదు రోజుల పాటు హీట్‌వేవ్‌ పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో పౌరులు బయటికి వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అయితే ఏప్రిల్‌ 28 నుంచి 30 మధ్య ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.  

Advertisement
Advertisement