చెన్నై-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతుండగా కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా బెంగళూరు వాసులుగా తెలుస్తోంది. తిరుమల నుంచి వెళ్తుండగా బంగారుపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.


