సాక్షి ఢిల్లీ : దేశ రాజధానిలో ఘోర ప్రమాదం జరిగింది. సత్యనికేతన్ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే భవనం కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


