
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్వారకలోని శబ్ద్ అపార్ట్మెంట్ పైఅంతస్తును అగ్నికీలలు చుట్టుముట్టాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అపార్ట్మెంట్లోని తొమ్మిదవ అంతస్తు నుంచి ఇద్దరు చిన్నారులతో సహా వారి తండ్రి కిందకు దూకేసి, తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, కొద్దిసేపటి తరువాత వారి తండ్రి కూడా మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
दिल्ली के द्वारका इलाके में एक अपार्टमेंट में लगी भीषण, द्वारका के सेक्टर 13 स्थित Shabd अपार्टमेंट की घटना, तीन लोग ऊपर से कूदे हैं, तीनों की हालत काफी गंभीर है। pic.twitter.com/Rjt3FteA8b
— NBT Hindi News (@NavbharatTimes) June 10, 2025
ఢిల్లీలో ప్రస్తుతం తీవ్రమైన తీవ్రమైన వేడి వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయ. ద్వారకలోని శబ్ధ్ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న దరమిలా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. భవనం నుంచి ఇద్దరు చిన్నారులతో పాటు వారి తండ్రి కూడా దూకేశాడు. వారు తీవ్ర గాయాటలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అగ్ని ప్రమాదం సమయంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. అగ్నిమాపక దళానికి చెందిన సిబ్బంది అపార్ట్మెంట్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు శాయశక్తులా కృషిచేశారు.

ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్