కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు | Delhi Police serves notice to Arvind Kejriwal over MLAs poaching claims | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు

Feb 4 2024 6:27 AM | Updated on Feb 4 2024 6:27 AM

Delhi Police serves notice to Arvind Kejriwal over MLAs poaching claims - Sakshi

ఢిల్లీ: ఆప్‌ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ చేసిన ఆరోపణలకు గాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు శనివారం పోలీసులు నోటీసులిచ్చారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను మూడు రోజుల్లో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐదు గంటలు హైడ్రామా జరిగింది.

కేజ్రీవాల్‌ నివాసంలో అధికారులు తాము నోటీసులు తీసుకుంటామని చెప్పగా పోలీసులు నిరాకరించారు. సీఎంకే ఇస్తామన్నారు. చివరికి కేజ్రీవాల్‌ బయటకు రాగా నోటీసులిచ్చారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తామిచ్చిన ఐదు నోటీసులకు కేజ్రీవాల్‌ స్పందించలేదంటూ ఈడీ అధికారులు శనివారం అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ దివ్యా మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 7వ తేదీన విచారణ చేపడతామని మేజిస్ట్రేట్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement