ఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్‌.. ఇంకా శిథిలాల కిందే పలువురు | Delhi Mustafabad Building Collapse Rescue Live Updates | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్‌.. ఇంకా శిథిలాల కిందే పలువురు

Apr 19 2025 7:29 AM | Updated on Apr 19 2025 11:18 AM

Delhi Mustafabad Building Collapse Rescue Live Updates

న్యూఢిల్లీ, సాక్షి: ముస్తాఫాబాద్‌(Mustafabad) భవన కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సంయుక్తంగా చేపట్టిన సహాయక చర్యల్లో.. ఇప్పటిదాకా 14 మందిని రక్షించగలిగారు. మరో 12 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

ANI న్యూస్‌ ఏజెన్సీ కథనం ప్రకారం.. అర్ధరాత్రి 3గం. ప్రాంతంలో ముస్తాఫాబాద్‌లో ఓ భవనం కుప్పకూలినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌​ సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఉదయం కల్లా పలువురిని బయటకు తీసి జీబీటీ  ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో నలుగురు చనిపోయారు. 

ఆ భవనంలో ఒక పోర్షన్‌లో ఒకే కుటుంబానికి చెందిన పది మంది నివాసం ఉంటున్నారని, అందులో ఆరుగురు చిన్నపిల్లలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వాళ్ల జాడపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారింది.  ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈ ప్రభావంతోనే భవనం కూలి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతవారం కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఓ వ్యక్తి మరణించగా..ఇద్దరు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement