‘డిప్యూటీ స్పీకర్‌ పదవి’పై ప్రధానికి మల్లికార్జున ఖర్గే లేఖ | congress chief mallikarjun kharge writes to pm modi presses for election of lok sabha deputy speaker | Sakshi
Sakshi News home page

‘డిప్యూటీ స్పీకర్‌ పదవి’పై ప్రధానికి మల్లికార్జున ఖర్గే లేఖ

Jun 11 2025 5:11 AM | Updated on Jun 11 2025 5:11 AM

 congress chief mallikarjun kharge writes to pm modi presses for election of lok sabha deputy speaker

కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహారిస్తోందని విమర్శ  

లోకసభ వర్షాకాల సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరపాలని డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ లేవనెత్తింది. డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ పదవిని ఖాళీగా ఉంచడం భారత ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని, ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్నారు. జూలై 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఖర్గే ఈ డిమాండ్‌ చేశారు.

‘లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీకి సంబంధించిన ఆందోళనకరమైన విషయంపై మీ దృష్టిని ఆకర్షించడానికే నేను ఈ లేఖ రాస్తున్నాను’అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రధానికి రాసిన తన లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 93 లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఇద్దరినీ ఎన్నుకోవడానికి వీలు కల్పిస్తుంది. రాజ్యాంగపరంగా, డిప్యూటీ స్పీకర్‌ లోక్‌సభ స్పీకర్‌ తర్వాత రెండవ అత్యున్నత ప్రిసైడింగ్‌ అధికారి. సంప్రదాయంగా లోక్‌సభ రెండవ లేదా మూడవ సమావేశంలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికవుతారని... లోక్‌సభలో కార్యనిర్వహణ, విధాన నియమాలలోని 8(1) నిబంధన ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక తేదీని స్పీకర్‌ నిర్ణయిస్తారు అనేది ఒకే తేడా అని ఖర్గే తెలిపారు.

మొదటి లోక్‌సభ నుంచి పదహారవ లోక్‌సభ వరకు ప్రతి సభలో ఒక డిప్యూటీ స్పీకర్‌ ఉన్నారని ఖర్గే అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యుల నుంచి డిప్యూటీ స్పీకర్‌ను నియమించడం ఒక ఆనవాయితీ అని... స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ఈ పదవి వరుసగా రెండు లోక్‌సభ పర్యాయాలు ఖాళీగా ఉందని ఖర్గే విమర్శించారు. పదిహేడవ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక కాలేదని.. ఇదే విధా నం పద్దెనిమిదవ లోక్‌సభలో కూడా కొనసాగుతోందన్నారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని.. ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఖర్గే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల సభ సంప్రదాయాలను, పార్లమెంటు ప్రజాస్వామ్య విలువలను దృష్టిలో ఉంచుకుని, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement