UPI: యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఛార్జీలపై కేంద్రం క్లారిటీ! | Central Govt Good news for UPI users there will be no charges | Sakshi
Sakshi News home page

UPI: యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఛార్జీలపై కేంద్రం క్లారిటీ!

Aug 8 2026 11:44 PM | Updated on Aug 8 2026 11:51 PM

Central Govt Good news for UPI users there will be no charges

సాక్షి,న్యూఢిల్లీ: ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే కోట్లాది మంది యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక క్లారిటీ ఇచ్చింది. యూపీఐ(UPI) ద్వారా పేమెంట్స్ చేసే వినియోగదారులపై ఎలాంటి ఛార్జీలు విధించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల UPI లావాదేవీలపై మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) విధించే అంశంపై చర్చ జరగడంతో.. ఇకపై UPI పేమెంట్లకు కూడా ఛార్జీలు పడతాయంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ.. MDR ఉన్నా అది వినియోగదారులపై భారం కాదని, అవసరమైతే ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలకే వర్తించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

అంటే.. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి UPI యాప్స్ ద్వారా సాధారణంగా డబ్బులు పంపే యూజర్లు ప్రస్తుతం ఉన్నట్టే ఫ్రీగా పేమెంట్స్ చేసుకోవచ్చు. దీంతో UPI ఛార్జీలపై నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement