18న ఎన్డీఏ భేటీకి రండి | BJP chief JP Nadda writes to Chirag Paswan to join NDA Meet | Sakshi
Sakshi News home page

18న ఎన్డీఏ భేటీకి రండి

Jul 16 2023 6:27 AM | Updated on Jul 16 2023 6:27 AM

BJP chief JP Nadda writes to Chirag Paswan to join NDA Meet - Sakshi

న్యూఢిల్లీ: ఎన్డీయే పక్షాలతో ఈనెల 18న జరగబోయే కీలక భేటీకి పలు పార్టీల అగ్రనేతలను బీజేపీ ఆహ్వానిస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వారికి ఈ మేరకు లేఖ రాశారు. లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) నేత చిరాగ్‌ పాశ్వాన్‌కూ లేఖ అందింది.

ఆయనతో కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఇప్పటికే భేటీ కావడం తెలిసిందే. బిహార్‌ మాజీ సీఎం, హిందుస్తానీ ఆవామ్‌ మోర్చా చీఫ్‌ జితన్‌ రామ్‌ మాంఝీ కూడా హాజరవుతారని సమాచారం. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంతటి విస్తృతస్థాయిలో ఎన్డీయే భేటీ జరగనుండటం ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement