-
Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిహార్ నుంచి 25 ఏళ్ల శాంభవి చౌదరి ఎన్నికల్లో పోటీ చేయనుంది. దేశంలో అతి చిన్నవయసు మహిళా దళిత అభ్యర్థిగా శాంభవి వార్తల్లో నిలిచింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా తాను వేయదగ్గ ముద్ర... తనదైన దృష్టికోణం ఉన్నాయంటున్నది శాంభవి. ‘నేను పనిచేసే చోట స్త్రీలు, యువతే నా లక్ష్యం. వీరికి ఆర్థిక స్వావలంబన, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తే అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది’ అంటోంది శాంభవి చౌదరి. 25 ఏళ్ల 9 నెలల వయసు వున్న ఈ డాక్టరెట్ స్టూడెంట్ బిహార్లోని ‘సమస్తిపూర్’ పార్లమెంట్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్విలాస్) తరఫున పోటీ చేయనుంది. ఇది రిజర్వ్డ్ స్థానం. బహుశా శాంభవి దేశంలోనే అత్యంత చిన్న వయసు కలిగిన దళిత మహిళా అభ్యర్థి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. అందుకే అందరూ ఆమెవైపు ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎం.ఏ. సోషియాలజీ చేసి ఇప్పుడు ‘బిహార్ రాజకీయాల్లో కులం, జెండర్ ప్రాధాన్యత’ అనే అంశం మీద పీహెచ్డీ చేస్తున్న శాంభవి రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి అశోక్ కుమార్ చౌదరి జెడి (యు)లో మంత్రి. తాత మహదేవ్ చౌదరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేశారు. శాంభవి భర్త సాయన్ కునాల్ సామాజిక రంగంలో ఉన్నాడు. ఈమె మామగారు మాజీ ఐ.పి.ఎస్ అధికారి ఆచార్య కిశోర్ కునాల్ దళితుల కోసం చాలా పోరాటాలే చేశాడు. చాలా గుడులలో దళిత పురోహితులను ఆయన నియమించాడు. వీరందరి మధ్యలో చదువు మీద దృష్టి పెట్టి, పరిశోధన కొనసాగిస్తున్న శాంభవి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో దిగింది. నాకంటూ వ్యక్తిత్వం ఉంది శాంభవి పోటీ చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఎన్డిఏ కూటమిలో ఉంది. బిజెపి కుటుంబ వారసత్వం గురించి అభ్యంతరం చెప్పడం తెలిసిందే. ‘మీ నాన్నగారు మంత్రి. మరి మీకు సీటిచ్చారు’ అనే ప్రశ్నకు ‘నిజమే. కాని నాకు సీటు రావడంలో ఆయన ప్రమేయం మాత్రం లేదు. చిన్నప్పటి నుంచి నేను మా తాత, నాన్న పేదవాళ్ల సమస్యలు వింటూ వారి కోసం పనిచేయడం చూస్తూ పెరిగాను. అది నామీద ఎక్కడో ప్రభావం చూపింది. దళితుల్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా, చదువుకున్న మహిళగా దళితుల పట్ల నాకు అవగాహన ఉంది. రాజకీయ కుటుంబం నుంచి రావడం వల్ల ప్రజలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు. ఎలక్షన్లు సమీపించేవరకూ నేను నిలబడాలని అనుకోలేదు. కాని సమీపించాక లోక్ జనశక్తి చీఫ్ చిరాగ్ పాశ్వాన్తో చెప్పాను. ఆయన నా భర్తను సొంత తమ్ముడిలా చూస్తారు. అంతేకాదు, బిహార్ రాజకీయాలలో యువత రాణించాలని భావిస్తారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయన్న కారణం రీత్యానే సీట్ ఇచ్చారు’ అని తెలిపిందామె. అత్తగారి ఊరు పట్నాలో పుట్టి పెరిగిన శాంభవి తన అత్తగారి ఊరైన సమస్తిపూర్లో గెలవడానికి సిద్ధమవుతోంది. ‘ఆ ఊరి గురించి నిజం చెప్పాలంటే నాకేమీ తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మొదట అక్కడ ఒక ఇల్లు కొని అక్కడే ఉంటానన్న భరోసా కల్పించాలి. ఆ ఊరి యువతతో ఇప్పటికే కాంటాక్ట్లోకి వెళ్లాను. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపిస్తారు. అవి వమ్ము చేయకుండా ఉండటమే నా ప్రథమ లక్ష్యం’ అంటున్న శాంభవి రాజకీయ జీవితాన్ని త్వరలో ఓటర్లు నిర్ణయిస్తారు. -
ఎల్జేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల
ఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విడతల వారీగా లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర రాజకీయ పార్టీ 'లోక్ జనశక్తి పార్టీ' (LJP) తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన లోక్ జనశక్తి పార్టీ.. వైశాలి, హాజీపూర్, సమస్తిపూర్, ఖగారియా, జముయి స్థానాల్లో పోటీ చేయనుంది. దీనికోసం ఐదు మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ రిలీజ్ చేసింది. హాజీపూర్ నుంచి పార్టీ చీఫ్ 'చిరాగ్ పాశ్వాన్' పోటీ చేయనున్నారు. జముయ్ నుంచి అరుణ్ భారతి, ఖగారియా నుంచి రాజేష్ వర్మ, సమస్తిపూర్ నుంచి శాంభవి చౌదరి, వైశాలి నుంచి వీణాదేవిలను ఎన్నికల బరిలో దించింది. మార్చి 18న.. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లోక్సభ ఎన్నికల కోసం బీహార్లో సీట్ల ఒప్పందాన్ని ప్రకటించింది. బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో, జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఒక్కో స్థానంలోనూ పోటీ చేయనున్నాయి. కాగా లోక్ జనశక్తి పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేస్తుంది. लोक जनशक्ति पार्टी (रामविलास) के द्वारा लोकसभा चुनाव - 2024 के लिए निम्न प्रत्याशियों के नामों पर अपनी सहमति प्रदान की है :@iChiragPaswan @ANI pic.twitter.com/XZTZsuUU3L — Lok Janshakti Party (@LJP4India) March 30, 2024 -
ఇండియా కూటమితో టచ్లో పశుపతి పరాస్!
రాష్ట్రీయ లోక్జనశక్తి (ఆర్ఎల్జేపీ) పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్.. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీహార్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో తనకు అన్యాయం జరగటంతో ఎన్డీయే కూటమితో పాటు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ప్రకటించారు. అయితే ఆయన ప్రతిపక్షాల ఇండియా కూటమికి టచ్లో ఉన్నారని తెలుస్తోంది. పశుపతి పరాస్ ఎన్డీయేకు గుడ్బై చెప్పిన వెంటనే ఆర్జేడీ నేత తేజ్ప్రతాప్ యాదవ్ స్పందిస్తూ.. బిహార్లోని ప్రతిపక్ష కూటమికి ఆహ్వానించారు. ‘ఒకవేళ పశుపతి పరాస్ బీహార్ ప్రతిపక్ష కూటమిలోకి రావాలనుకుంటే.. మేము స్వాగతం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే. రాజీనామా చేసిన పరాస్ను బీజేపీ ఏం చేయలేదు’ అని అన్నారు. అయితే పరాస్.. పలు లోక్సభ స్థానాలతో పాటు హాజీపూర్ సెగ్మెంట్ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంతో కీలకమైన హాజీపూర్ స్థానంలో కచ్చితంగా పోటీ చేస్తానని.. అవసరమైతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడానికి కూడా సిద్దమేని ఇటీవల పరాస్ ప్రకటించారు. అయితే సోమవారం బీజేపీ.. పరాస్ను పక్కనబెట్టి జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)తో సీట్ల పంపకం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పశుపతి పరాస్ ఎన్డీయే నుంచి తప్పుకున్నారు. మరోవైపు పరాస్కు కంచుకోట అయిన హాజీపూర్లో బీజేపీ.. లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) పార్టీ అభ్యర్థికి టికెట్ కేటాయించటం గమనార్హం. ఒకవేళ పరాస్ ఇండియా కూటమిలో చేరితే ఆయనకు హాజీపూర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందో లేదో వేచి చూడాలి. -
‘అవసరమైతే ఎన్డీయే నుంచి బయటకొస్తాం’
బీహార్లో ఎన్డీయే కూటమికి మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) ఝలక్ ఇచ్చింది. తాము కోరుకున్న స్థానాలు ఇవ్వని పక్షంలో ఒంటరి పోరుకైనా సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో ఉన్న మంత్రి పశుపతి కుమార్ పరాస్ స్వయంగా ప్రకటించారు. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్ఎల్జేపీ)కి గట్టిపట్టు ఉన్న ఐదు స్థానాల్లో పోటీ ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరతాం. ఆ సీట్లను వేరేవాళ్లకు కేటాయిస్తే చూస్తూ ఊరుకోం. నేను కూడా లోక్సభ బరిలో ఉంటా అని పశుపతి కుమార్ పరాస్ స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని గనుక విస్మరిస్తే.. ఏ నిర్ణయం తీసుకోవటానికైనా వెనకాడబోమని ఎన్డీయేను హెచ్చరించారాయన. కూటమిలో భాగంగా చిరాగ్ పాశ్వన్ లోక్జనశక్తి పార్టీ(రాం విలాస్)కి బీజేపీ ఐదు సీట్లను కేటాయించింది. అందులో.. ఆర్ఎల్జేపీ చీఫ్ పశుపతి ప్రాతినిధ్యం వహిస్తున్న హాజీపూర్ స్థానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూటమిలో తమకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఆర్ఎల్జేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ‘కూటమి నుంచి వెళ్లిపోవడానికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి’ అంటూ పశుపతి వ్యాఖ్యానించడం గమనార్హం. ‘మేము ఎన్డీయేలో భాగం. మేము నిజాయితీగా కూటమిలో ఉన్నాం. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటే మాకు గౌరవం ఉంది. మా పార్టీకి బీజేపీ నుంచి ప్రాధాన్యత లభించటం లేదని వార్తలు వస్తున్నాయి. మా పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ చివరి జాబితా వెల్లడించే వరకు మేము వేచిచూస్తాం. ఆ తర్వాత మేము ఇక ఎవరికి గౌరవం ఇవ్వాల్సి అవసరం లేదు. మా స్వేచ్ఛానుసారం కూటమి నుంచి బయటకు వచ్చేస్తాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు’ అని పశుపతి పేర్కొన్నారు. -
ఇండియా కూటమి కొత్త ప్లాన్.. బీజేపీ మిత్ర పక్షానికి గాలం!
రానున్న లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి సరికొత్త ఎత్తులు వేస్తోంది. బీహార్లో సీట్ల పంపకాల విషయంలో ఎన్డీఏలో తర్జనభర్జనలు కొనసాగుతుండగా ఇండియా కూటమి రాజకీయ చదరంగంలో ఎత్తుగడ వేసింది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్కు బిహార్లో ఎనిమిది లోక్సభ స్థానాలు, ఉత్తరప్రదేశ్లో రెండు స్థానాలను ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఎన్డీఏ బీహార్లో తమకు కేవలం ఆరు లోక్సభ నియోజకవర్గాలను మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఇవి కూడా తన చిన్నాన్న పశుపతి పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీతో పంచుకోవాల్సి రావచ్చు. ఇటువంటి పరిస్థితిలో ఇండియా కూటమి నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన పాశ్వాన్ను ఊరించవచ్చు. చిరాగ్ పాశ్వాన్ను ఆకట్టుకునేందుకు 2019లో అవిభాజ్య లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) పోటీ చేసిన మొత్తం ఆరు సీట్లతోపాటు అదనంగా బిహార్లో రెండు, ఉత్తరప్రదేశ్లో రెండు స్థానాలను ఇండియా కూటమి ఈ డీల్లో పొందుపరిచినట్లు సమాచారం. పార్టీ చీఫ్, ప్రముఖ నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణించిన ఏడాది తర్వాత పశుపతి పరాస్ తిరుగుబాటుతో 2021లో లోక్ జనశక్తి పార్టీ చీలిపోయింది. పశుపతి పరాస్ రామ్ విలాస్ పాశ్వాన్కు సోదరుడు. చిరాగ్ పాశ్వాన్కు చిన్నాన్న. పరాస్కు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్ బెర్త్ ఇచ్చినప్పుడు చిరాగ్ పాశ్వాన్ జేడీయూ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై విమర్శలు చేశారు. అయితే బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని మాత్రం పళ్లెత్తు మాట కూడా అనలేదు. నితీష్ కుమార్తో విభేదాల కారణంగా 2020లో ఎన్డీఏ నుండి వైదొలిగిన చిరాగ్ పాశ్వాన్ మళ్లీ గతేడాది తిరిగి ఎన్డీఏలో చేరారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement