
Ahmedabad Incident Updates..
బ్లాక్ బాక్స్ రికవరీ నివేదికలు ఊహాగానాలు మాత్రమే: ఎయిర్ ఇండియా
- అహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్పై ఫేక్ ప్రచారం
- బ్లాక్ బాక్స్ దొరికిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం.
- తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఎయిర్ ఇండియా.
- బ్లాక్ బాక్స్పై ఎంత దొరకలేదని స్పష్టం చేసిన ఎయిర్ ఇండియా.
Till now, the black box is not recovered from the plane.
The black box is located in the tail section of the aircraft.
The tail of the aircraft is stuck into the building.
To access the blackbox safely, the tail needs to be removed from the building.
But the work regarding… pic.twitter.com/c9B62v10Ce— Kapil (@kapsology) June 13, 2025
మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు
- డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
- ప్రమాదంలో మృతదేహాలన్ని కూడా మాంసపు ముద్దల్లా మారిపోయాయి.
- తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలను నిర్వహించి వారిని గుర్తించనున్నారు.
- డీఎన్ఏ కోసం శాంపిళ్ల సేకరణ
- విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ కోసం అధికారులు శాంపిళ్లను సేకరించారు.
- డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతుదేహాలను గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించనున్నారు.
విమాన ప్రమాదంపై మోదీ స్పందన..
- విమాన ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా.
- ఇంత మంది ప్రాణాలు కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేను.
- ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
అహ్మదాబాద్ విమానాశ్రయంలో మోదీ సమీక్ష
- అహ్మదాబాద్ విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ
- అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని సమీక్ష
- సమీక్షలో అధికారులు, సహా మంత్రులు పాల్గొన్నట్టు సమాచారం
- అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న మోదీ.
- ఆసుపత్రిలో క్షతగాత్రులను ప్రధాని మోదీ పరామర్శించారు.
- వారి ఆరోగ్య పరిస్థితిన అడిగి తెలుసుకున్నారు.
#WATCH | PM Modi meets and enquires about the health condition of those injured in the Air India plane crash in Ahmedabad pic.twitter.com/QCFrmdSEXx
— ANI (@ANI) June 13, 2025
#WATCH | PM Modi visits Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 plane crash pic.twitter.com/ebUFXSTT8o
— ANI (@ANI) June 13, 2025
ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ..
#WATCH | The wreckage of the AI-171 plane hangs from BJ Medical College's building, which it crashed into soon after take-off from Ahmedabad airport yesterday
PM Modi visited the plane crash site today to assess the ground situation.
(video source: DD) pic.twitter.com/ScTDNv5nYz— ANI (@ANI) June 13, 2025
- ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ..
- ప్రధాని మోదీ విమాన ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
- ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
- ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
- మృతుల కుటుంబాలను మోదీ పరామర్శ.
- ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్తో మాట్లాడిన మోదీ.
- విమాన ప్రమాదంతో తీవ్ర విషాదం
#WATCH | PM Modi visits the site of AI-171 flight crash in Ahmedabad
The crash claimed the lives of 241 people, including 12 crew members onboard. pic.twitter.com/gCvP229Vcs— ANI (@ANI) June 13, 2025

- ఘటనా స్థలికి ఫోరెన్సిక్ బృందం..
- విమాన ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిన్ నిపుణుల బృందం
#WATCH | A forensic team arrives at the #AirIndiaPlaneCrash site, in Ahmedabad. pic.twitter.com/d49Bnxdjgl
— ANI (@ANI) June 13, 2025
ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరగాలి..
- AI-171 విమాన ప్రమాదంపై బాధిత కుటుంబ సభ్యుడి ఆవేదన..
- అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వద్ద ఓ వ్యక్తి ఆగ్రహం..
- ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలి.
- మా ప్రాణాలకు విలువ లేదా?
- కఠిన చర్య తీసుకోవడం ఎయిర్ ఇండియా బాధ్యత.
#WATCH | On the AI-171 plane crash, a local at Ahmedabad Civil Hospital says, "There should be a thorough investigation into how this incident happened. Does life have no value?? It is Air India's responsibility to take action." pic.twitter.com/MPbmkHdelr
— ANI (@ANI) June 13, 2025
అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
- ప్రధాని మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు.
- విమానం ప్రమాదానికి గురైన స్థలాన్ని పరిశీలించనున్నారు.
PM Narendra Modi will be visiting Gujarat's Ahmedabad today.#AhmedabadPlaneCrash pic.twitter.com/4fN7dla4va
— ANI (@ANI) June 13, 2025
ప్రమాద ఘటనా స్థలానికి ఎయిరిండియా సీఈవో
- అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన చోటుకి ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంపుబెల్ విల్సన్ చేరుకున్నారు.
- ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
- మరోవైపు.. ఘటన స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
- శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.
#WATCH | Air India MD & CEO Campbell Wilson arrives at AI-171 plane crash site in Ahmedabad
241 passengers lost their lives in the plane crash yesterday pic.twitter.com/Jw1GOnduUI— ANI (@ANI) June 13, 2025
విమాన ప్రమాదం.. ఈవెంట్లు రద్దు
- అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం
- ఈ ఘటనపై ప్రముఖులు దిగ్భ్రాంతి
- పలు సినిమా ఈవెంట్లు రద్దు
గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.
#WATCH | Visuals from AI-171 crash site in Ahmedabad, Gujarat
Air India has confirmed the loss of 241 lives of the 242 passengers on board the aircraft, which crashed soon after takeoff yesterday pic.twitter.com/1alznlNj40— ANI (@ANI) June 13, 2025
కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.
230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది.