UP Accident: ఘోర బస్సు ప్రమాదం | 5 Members Died And 15 Injured After Double Decker Bus Rams Truck In UP Yamuna Expressway, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోర బస్సు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్సు

Nov 21 2024 8:11 AM | Updated on Nov 21 2024 10:35 AM

UP Accident: Double Decker bus rams truck in Yamuna Expressway

లక్నో: యూపీలో అర్ధరాత్రి యమునా ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు నెత్తురోడింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓ వోల్వో బస్సు  ఒకటి.. ట్రక్కును వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మరణించారు. 15 మందికి గాయాలు కాగా.. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ఢిల్లీ నుంచి అజాంఘడ్‌ వెళ్తున్న డబుల్‌ డెక్కర్‌ బస్సు.. తప్పల్‌ వద్ద ఎదురుగా వస్తున్న ఖాళీ బీర్ల సీసాల ట్రక్కును ఢీ కొట్టింది. ఘటనలో ఐదుగురు చనిపోగా.. ఇందులో ఓ పసికందు, మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం.  మరో 15 మందికి గాయాలయ్యాయి. 

ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం తుక్కుతుక్కు అయ్యింది. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని అతికష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రుల్ని జెవార్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement