కాంతారను వెంటాడుతున్న విషాదాలు.. ఎందుకిలా జరుగుతోంది? | Rishab Shetty Kantara Chapter 1 Movie Facing Setbacks | Sakshi
Sakshi News home page

Kantara Chapter 1: వరుస విషాదాలు.. పంజుర్లి ఆగ్రహం వల్లే మరణాలు?

Jun 14 2025 7:03 PM | Updated on Jun 14 2025 7:27 PM

Rishab Shetty Kantara Chapter 1 Movie Facing Setbacks

కన్నడ స్టార్‌ రిషబ్‌ శెట్టి (Rishab Shetty) నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ కాంతార (Kantara Movie). 2022లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ సక్సెస్‌ సాధించిన ఈ చిత్రానికి మేకర్స్‌ ప్రీక్వెల్‌ (కాంతార: చాప్టర్‌ 1) ప్రకటించారు.

అయితే ఏ ముహూర్తాన కాంతార 1 ప్రకటించారో కానీ అప్పటినుంచి ఏదో ఒక అడ్డంకులు, విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాంతార నటుడు, మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్‌ కళాభవన్‌ విజు (43) గుండెపోటుతో మరణించాడు. తీర్థహళ్లిలో చిత్రయూనిట్‌తో బస చేసిన అతడికి బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశాడు. ఇతడు మాలికాపురం, మార్కో వంటి పలు చిత్రాల్లో నటించాడు. 25 ఏళ్లుగా మిమిక్రీ రంగంలో రాణిస్తున్నాడు.

గతంలో..
షూటింగ్‌ ప్రారంభించిన కొత్తలో కర్ణాటకలోని ముడూరులో 20 మంది జూనియర్‌ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారేమో తీవ్రమైన గాలివాన వల్ల భారీ సెట్‌ కూలిపోయింది. ఇటీవల మలయాళ జూనియర్‌ ఆర్టిస్ట్‌ కపిల్‌ ప్రమాదవశాత్తూ నదిలో మునిగి విగతజీవిగా తేలాడు. ఆ తర్వాత కన్నడ నటుడు, హాస్య నటుడు రాకేశ్‌ పూజారి (33) గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు కళాభవన్‌ కన్నుమూశాడు. ఈ వరుస విషాదాలు కాంతార చిత్రయూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

అడవిలో పేలుళ్లు
అయితే నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ఆరోపణలు వచ్చాయి. అడవిలో పెద్ద మంటలు వేసి షూటింగ్‌ చేస్తున్నారని, పేలుళ్లతో ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయం అక్కడి అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె దృష్టికి రాగా.. తక్షణమే షూటింగ్‌ ఆపేయాలని అధికారులను ఆదేశించారు.

ఇకపోతే పంజుర్లి దేవుడి ఆగ్రహంతోనే ఇలా జరుగుతోందన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. కాంతార సినిమాతోనే పంజుర్లి దేవుడు గురించి వెలుగులోకి వచ్చింది. పంజుర్లి అంటే పంది. చెడు చేసేవారిని శిక్షించి, మంచిని ఆశీర్వదించే భగవంతుడే పంజుర్లీ అని నమ్ముతారు.

చదవండి: మా అక్కను పెళ్లి చేసుకుంటే 1+1 ఆఫర్‌.. అవాక్కైన హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement