Richa Chadha: వారి వల్లే బాలీవుడ్‌ నష్టపోతోంది: హీరోయిన్‌

Richa Chadha On South Indian Film Industry Vs Bollywood - Sakshi

తన నటనతో బాలీవుడ్‌లో ప్రత్యేక ముద్ర వేసుకుంది రిచా చద్దా. 2017లో 'ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌' వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఈ సిరీస్‌ మూడో సీజన్‌లో కూడా నటించి అలరించింది. అయితే ప్రస్తుతం సౌత్‌ ఇండియా, నార్త్‌ ఇండియా సినిమాల మధ్య కాంట్రవర్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. పుష్ప, ఆర్ఆర్ఆర్‌, కేజీఎఫ్‌ 2 వంటి సౌత్ మూవీస్‌ పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలై బాలీవుడ్‌లోనూ మంచి కలెక్షన్లు రాబట్టాయి. అక్కడితో ఆగకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌ 2 సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్‌లోనూ చేరాయి. ఈ క్రమంలో సౌత్ ఇండియా సినిమా కలెక్షన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రిచా చద్దా. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్ ఇండియన్‌ సినిమాలకు టికెట్ల రేట్లు రూ. 100 నుంచి 400 లోపు మాత్రమే ఉంటాయి. అందువల్ల ఆ మాత్రం ఖర్చు చేసేందుకు అభిమానులు వెనుకాడరు. స్టార్ హీరోలకు ఫ్యాన్‌ బేస్‌ ఎక్కువ. వారంతా ఆ ఖర్చు పెట్టి సినిమాలు చూస్తారు. అందుకే పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్‌ వస్తాయి. ఆ సినిమా హిట్‌ అయినా ప్లాప్‌ అయినా ఆ ధరలు అలాగే ఉంటాయి. కానీ బాలీవుడ్‌లో అలా కాదు. సినిమా హిట్ అయినా, కాకున్నా టికెట్‌ ధర రూ. 400కు పైనే ఉంటుంది. దీంతో అంత ధర పెట్టేందుకు ప్రేక్షకులు ధైర్యం చేయరు. ఆ డబ్బుతో నిత్యవసరాలు వస్తాయని సగటు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇక సినిమాకు ప్లాప్ టాక్ వచ్చిందటే కలెక్షన్లు దారుణంగా ఉంటాయి. హిందీలో డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వల్ల బాలీవుడ్‌ సినిమా నష్టపోతోంది.' అని రిచా చద్దా పేర్కొంది. 

చదవండి: బాలీవుడ్‌పై మరోసారి ఆర్జీవీ షాకింగ్‌ కామెంట్స్‌..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top