
హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలకపాత్రధారులు.
పనోరమా స్టూడియోస్ అండ్ టి–సిరీస్ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రెప్పల్ డప్పుల్...’ అంటూ సాగే రెండోపాట లిరికల్ వీడియోను ఈ నెల 25న విడుదల చేయన్నుట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్.