
తమిళంలో ఘన విజయం సాధించిన 'డీఎన్ఏ' సినిమాని తెలుగులో 'మై బేబీ' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా.. ఈనెల 18న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్మాల్, పిజ్జా లాంటి విజయవంతమైన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేశ్ కొండేటి.. ఈ 'మై బేబి'ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి నెల్సన్ వెంకటేశన్ దర్శకుడు. 2014లో ఓ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో రూపొందిన భావోద్వేగపూరిత కథాంశమిదని మేకర్స్ చెబుతున్నారు. ఎస్.కె.పిక్చర్స్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది.
