
సినిమాలు అప్పుడప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటాయి. రీసెంట్ టైంలో 'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan Movie) చిత్రం ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే ఉందని చెప్పొచ్చు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని సన్నివేశాలున్నాయని తొలిరోజే విమర్శలు రావడంతో నిర్మాత గోపాలన్, హీరో మోహన్ లాల్ (Mohanlal) క్షమాపణలు చెప్పారు.
(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా)
మరోవైపు నిర్మాత గోకులం గోపాలన్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరగ్గా.. లెక్కల్లో చూపని కొంత డబ్బు బయటపడింది. మరోవైపు ఈ చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్( Prithviraj Sukumaran)కి కూడా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. గత రెండు-మూడేళ్ల రెమ్యునరేషన్ లెక్కలు చూపించాలని మెయిల్ పంపింది. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ తల్లి మల్లిక స్పందించారు.
'నా కొడుకు ఏ తప్పు చేయలేదు. మేం దర్యాప్తుకి రెడీ. భయపడటం లేదు. ఈ విషయాన్ని మాకు సపోర్ట్ గా ఉన్న వాళ్లకు థ్యాంక్యూ. మమ్ముట్టి మాకు ధైర్యాన్నిస్తున్నారు. ఈ వార్తలన్నీ చూసి మాకు ధైర్యం చెప్పారు. దీంతో నాకు కన్నీళ్లొచ్చాయి' అని మల్లిక సుకుమారన్ చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: తారక్ కి ప్రేమతో.. సుకుమార్ ఇంట్లో ఎన్టీఆర్)