అమ్మ పాట రిలీజ్ చేసిన 'విశ్వంభర' డైరెక్టర్ వశిష‍్ట | Jo Jo Lali Amma Lyrical Song By Director Vasistha | Sakshi
Sakshi News home page

అమ్మ పాట రిలీజ్ చేసిన 'విశ్వంభర' డైరెక్టర్ వశిష‍్ట

Feb 26 2024 7:16 PM | Updated on Feb 26 2024 7:16 PM

Jo Jo Lali Amma Lyrical Song By Director Vasistha - Sakshi

విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'కలియుగం పట్టణంలో'. చిత్రా శుక్లా కీలక పాత్రలో నటించారు. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. మార్చి 22న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

ఈ సినిమాలోని 'జో జో లాలీ అమ్మ' అంటూ సాగే మదర్ సెంటిమెంట్ పాటని ప్రముఖ దర్శకుడు వశిష్ట రిలీజ్ చేశారు. పాట చాలా బాగుందని చిత్రయూనిట్‌ను అభినందించారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement