-
చిరంజీవి కొత్త సినిమాకు ఊహించని సమస్య?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. 'భోళా శంకర్' ఫ్లాప్తో చిరుపై గట్టి ఎఫెక్ట్ పడింది. దీంతో కొత్త మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. షూటింగ్ అంతా బాగానే నడుస్తోంది కానీ ఊహించని విధంగా ఓ సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి.. సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ రేంజుకి తగ్గ హిట్ అయితే పడట్లేదు. 'వాల్తేరు వీరయ్య'గా గతేడాది సంక్రాంతికి సక్సెస్ అందుకున్నప్పటికీ.. 'భోళా శంకర్' వల్ల కథ మళ్లీ మొదటికే వచ్చింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే టార్గెట్తో 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది) 'విశ్వంభర'లో హీరోయిన్గా త్రిష చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో చిరుకు ఏకంగా ఐదుగురు చెల్లెళ్లు ఉంటారని తెలుస్తోంది. ఇషా చావ్లా, సురభి, ఆషికా రంగనాథ్ తదితరులు ఈ పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వీళ్లకు జోడీలుగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో చిత్రబృందం తర్జనభర్జనా పడుతోందట. సుశాంత్, రాజ్ తరుణ్ లాంటి యంగ్ హీరోలు పలువురు పరిశీలనలో ఉన్నప్పటికీ ఫైనల్గా ఎవరు సెట్ అవుతారనేది చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'విశ్వంభర' సినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నారు. అధికారికంగా ప్రకటించేశారు కూడా. కీరవాణి సంగీతమందిస్తుండగా.. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ రూ.150 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: సీక్రెట్గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ) -
అమ్మ పాట రిలీజ్ చేసిన 'విశ్వంభర' డైరెక్టర్ వశిష్ట
విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'కలియుగం పట్టణంలో'. చిత్రా శుక్లా కీలక పాత్రలో నటించారు. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. మార్చి 22న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఈ సినిమాలోని 'జో జో లాలీ అమ్మ' అంటూ సాగే మదర్ సెంటిమెంట్ పాటని ప్రముఖ దర్శకుడు వశిష్ట రిలీజ్ చేశారు. పాట చాలా బాగుందని చిత్రయూనిట్ను అభినందించారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
తండ్రి అయిన 'విశ్వంభర' డైరెక్టర్ వశిష్ఠ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాతో బిజీగా ఉన్నారు. ఒక్క సినిమా తీసిన అనుభవమున్న దర్శకుడు వశిష్ఠ.. దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హీరోయిన్ త్రిష గురించి రీసెంట్గానే అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇలా అంతా సాఫీగా జరుగుతోంది. ఇలాంటి టైమ్లో ఓ గుడ్ న్యూస్ కూడా వినిపించింది. దర్శకుడు వశిష్ఠ తండ్రి అయ్యాడు. (ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన) వశిష్ఠ అసలు పేరు వేణు. తండ్రి నిర్మాత కావడంతో 'ప్రేమలేఖ' అనే సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ ఒక్క చిత్రంతో ఇక నటనకు పుల్స్టాప్ పెట్టేశాడు. చాలా ఏళ్ల తర్వాత 'బింబిసార' అనే చిత్రంతో దర్శకుడిగా మారిపోయాడు. అద్భుతమైన సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. వశిష్ఠకు మెగా ఛాన్స్ వచ్చేలా చేసింది. ప్రస్తుతం చిరుతో 'విశ్వంభర' సినిమా చేస్తూ వశిష్ఠ బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇతడి భార్య సుజాత ప్రెగ్నెన్సీ ఉంది. సోమవారం సాయంత్రం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఈ విషయం ఎవరూ బయటకు చెప్పలేదు. పాప పుట్టడం గురించి దర్శకుడు వశిష్ఠ అందరూ తెలియజేయాల్సి ఉంది. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) -
'విశ్వంభర' వీడియోకి సూపర్ రెస్పాన్స్.. దీన్ని డిజైన్ చేసిందెవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీకి 'విశ్వంభర' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి సందర్భంగా కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయగా.. దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. టైటిల్ దగ్గర నుంచి విజువల్స్ వరకు అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. అలానే వీడియోలోని గ్రాఫిక్స్, కాన్సెప్ట్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న ఈ వీడియోని ఎవరు డిజైన్ చేశారో తెలుసా? (ఇదీ చదవండి: గాయపడ్డ టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్.. ఇంతకీ ఏమైంది?) 'విశ్వంభర' టైటిల్ కాన్సెప్ట్ వీడియోరి డిజైన్ చేసింది అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. అసోసియేట్ డైరెక్టర్గా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో పలు సినిమాలకు పనిచేశాడు. ప్రభాస్ 'సాహో'తో పాటు 'రాధేశ్యామ్'కి కూడా అనిల్ పనిచేశారు. రాధేశ్యామ్ సినిమాలోని నీ రాతలే పాటకు కాన్సెప్ట్ డిజైన్ చేసి పిక్చరైజ్ అనిల్ చేశాడు. అఖిల్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తీయబోతున్నారు. ఈ ప్రాజెక్టుతో అనిల్.. దర్శకుడు కాబోతున్నాడు. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతోంది. 'విశ్వంభర' కాన్సెప్ట్ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించిన అనిల్.. మరి దర్శకుడిగా ఎలా ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి? (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమా టైటిల్ 'విశ్వంభర'.. ఇంతకీ దీని అర్థమేంటి?) -
రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త సినిమాల్ని ప్రకటించారు. అందులో ఒకటి ఆయన కూతురు సుస్మిత నిర్మిస్తోంది. దీనికి 'Chiru156' అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. అలానే 'బింబిసార' ఫేమ్ దర్శకుడు మల్లిడి వశిష్ట్తో చిరు కలిసి పనిచేయబోతున్నారు. దీనికి 'chiru157' అనేది వర్కింగ్ టైటిల్. అయితే రెండో మూవీకే చిరుతో కలిసి బంపరాఫర్ కొట్టేసిన ఈ కుర్ర డైరెక్టర్ ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? (ఇదీ చదవండి: 'రీమేక్స్'... చిరుకు కలిసొచ్చాయా? ముంచేశాయా?) 20 ఏళ్ల తర్వాత అప్పుడెప్పుడో 2003లో చిరు 'అంజి' అనే సోషియో ఫాంటసీ సినిమా చేశారు. ఆరేడేళ్ల పాటు సెట్స్పై ఉన్న ఆ సినిమా అప్పట్లో ఎందుకో సరిగా వర్కౌట్ కాలేదు. దీంతో చిరు ఆ తరహా చిత్రాలు చేయడమే మానేశారు. మళ్లీ ఇన్నాళ్లకు సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్లో నటించబోతున్నారు. దీనికి వశిష్ట్ దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. హీరో నుంచి డైరెక్టర్ తెలుగులో పలు సినిమాలతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మల్లిడి సత్యనారాయణ కొడుకే వశిష్ట్. ఇప్పుడంటే దర్శకుడిగా ఒక్క సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలోకి మల్లిడి వేణు పేరుతో తొలుత హీరోగా పరిచయమయ్యాడు. 16 ఏళ్ల క్రితం 'ప్రేమలేఖ రాశా' అనే మూవీలో నటించాడు. అందులో అంజలి హీరోయిన్. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ వర్కౌట్ కాకపోవడంతో వేణు నటన పక్కనబెట్టేశాడు. (ఇదీ చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?) ఒక్క సినిమాతో యాక్టింగ్ నుంచి సైడ్ అయిన వేణు.. తన పేరుని వశిష్ట్గా డైరెక్షన్ రూట్లోకి వచ్చాడు. కథలు పట్టుకుని రవితేజ, అల్లు శిరీష్ లాంటి హీరోలతో సినిమాలు తీసే ప్రయత్నాలు చేశాడు. కానీ శిరీష్తో ఓ ప్రాజెక్ట్ ఓకే అయి, బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయింది. ఫైనల్గా ఇతడిని నమ్మిన కల్యాణ్ రామ్.. 'బింబిసార' చేసే ఛాన్స్ ఇచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర ఇది సూపర్హిట్ కావడంతో వశిష్ట్ పేరు మార్మోగిపోయింది. పోస్టర్ చూస్తుంటే అయితే 'బింబిసార'తో సోషియో ఫాంటసీలో తన మార్క్ చూపించిన వశిష్ట్.. చిరుకు ఆ తరహా కథనే చెప్పాడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఓ పెద్ద శిల.. దానిపై బంగారు నక్షత్రం గుర్తు.. అందులో పంచ భూతాలని సూచిస్తూ ఐదు గళ్లని నింపుతూ మధ్యలో త్రిశూలం ఉండటం చూస్తుంటే ఇదేదో పెద్ద ప్లానింగ్లా కనిపిస్తుంది. రెండో సినిమాకే మెగాస్టార్ని ఒప్పించాడంటే, వశిష్ట్ మరో హిట్ కొట్టడం కన్ఫర్మ్ అనిపిస్తుంది. ప్రస్తుతానికి పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ చేస్తే అప్పుడు స్టోరీ ఏంటనేది తెలిసే ఛాన్స్ ఉంటుంది. My heartfelt thanks to the MIGHTY MEGASTAR @KChiruTweets garu for believing me and giving me the chance to present you on BIG screens🙏🏻 Wishing the BOSS of Masses a very happy birthday!🌟 Here’s the concept poster of #MEGA157 - MEGA MASS BEYOND UNIVERSE 🔥 More details soon!… pic.twitter.com/oA0rg3g5Zn — Vassishta (@DirVassishta) August 22, 2023 (ఇదీ చదవండి: 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్గా నటించిన ఈ వ్యక్తి గురించి తెలుసా?)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement