Actor Ameesha Patel Surrender In Check Bounce Case - Sakshi
Sakshi News home page

Ameesha Patel: ఆ కేసు విషయమై కోర్టులో లొంగిపోయిన హీరోయిన్!

Jun 18 2023 2:40 PM | Updated on Jun 18 2023 3:30 PM

Ameesha Patel Surrender In Check Bounce Case - Sakshi

ఆమె తెలుగులో సినిమాలు చేసిన హీరోయిన్. కాకపోతే చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం హిందీ, పంజాబీలో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గానే 'గదర్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇలా కెరీర్ పరంగా బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ‍్బందులు పడుతోంది. తాజాగా ఓ కేసు విషయమై కోర్టులో లొంగిపోయింది. 

2000లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా పటేల్.. హిందీ, తెలుగులో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. అ‍ప్పటినుంచి ఇప్పటివరకు అడపాదడపా మూవీస్ చేస్తూ వస్తోంది. కొన్నేళ్ల ముందు ఓ సినిమా విషయమై ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త అజయ్ కుమార్ దగ్గర రూ.2.5 కోట్ల వరకు డబ్బు తీసుకుంది. ఆ తర్వాత సదరు సినిమా పూర్తి చేయలేదు సరికదా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. ఓసారి చెక్ ఇస్తే అది బౌన్స్ అయింది. దీంతో అజయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు ఈమెపై పోలీస్ కేసు నమోదు చేశారు.

ఈ కేసు విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 6న అమీషా పటేల్ కు కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో రాంచీలోని సివిల్ కోర్టులో ఈమె శనివారం లొంగిపోయింది. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ భామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి బయటకు వచ్చిన టైంలో తలకు పూర్తిగా ముసుగు వేసుకుని మీడియా ప్రతినిధుల నుంచి ముఖం దాచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' మూవీ.. ప్రభాస్ అందుకే సైలెంట్‌గా ఉన్నాడా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement