After 16 Years Trisha To Reunite With Mega Star Chiranjeevi On Screen For His Next, Deets Inside - Sakshi
Sakshi News home page

Trisha In Chiranjeevi Movie: పదహారేళ్ల తర్వాత...

Jun 29 2023 3:36 AM | Updated on Jun 29 2023 8:53 AM

After 15 years Trisha To Share Screen Space With Mega Star Chiranjeevi - Sakshi

పదహారేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారని తెలిసింది. చిరంజీవి హీరోగా, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయట.

ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా శ్రీలీల నటించనున్నారని తెలిసింది. అలాగే చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారని, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారని సమాచారం. ఈ విషయాలపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఇక 2006లో వచ్చిన ‘స్టాలిన్‌’ చిత్రం తర్వాత చిరంజీవి, త్రిష మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement